శాతవాహనుల యుగం 3

TSStudies
0

శాతవాహనుల యుగం - మలి శాతవాహనులు 


గౌతమీపుత్ర శాతకర్ణి(క్రీ.శ. 106-130) :
  • ఇతను శాతవాహనులందరిలో గొప్పవాడు. ఇతని పరిపాలన కాలం 24 సం.లు 
  • క్రీ.శ. 78 లో శాలివాహన యుగం ప్రారంభించాడు. 
  • ఇతని తండ్రి పేరు శివ స్వాతి. తల్లి పేరు గౌతమీ బాలశ్రీ . ఈమె తన పుత్రుడి మరణాంతరం అతని గొప్పతనాన్ని వివరిస్తూ "నాసిక్" శాసనం వేయించింది. 
  • ఇతని యొక్క బిరుదు - త్రిసముద్ర పీతవాహన 
  • ఇతను శకులను, పల్లవులను, యవనులను ఓడించాడు. ఇతను క్షాత్రప వంశాన్ని నిర్ములించాడు. 
  • ఇతనికాలంలోనే తెలుగు ప్రాంతం మొత్తం ఆదీనంలో ఉంది. 
  • ఇతని కాలం నుంచే రాజులు తల్లుల పేర్లు తమ పేర్లతో జోడించుకొనే సంప్రదాయం మొదలైంది. 
  • ఇతను నాసిక్ దగ్గర 'జోగల్ తంబీ' అనే యుద్ధంలో శక రాజు 'సహఫానుణ్ణి' ఓడించి ఆతను ముద్రించిన వెండి నాణేలను సేకరించి మరల తన చిహ్నాలతో వాటిని పునః ముద్రించాడు. 
  • ఇతని కాలం లో రాజ్యం బాగా విస్తరించింది. 
  • ఇతను వైదిక మాత సంప్రదాయాలను పాటిస్తూ, బౌద్ధ మతాన్ని కూడా ఆచరించాడు. 
2వ పులోమావి / వాశిష్ఠపుత్ర శాతకర్ణి :
  • ఇతను గౌతమీపుత్ర శాతకర్ణి కుమారుడు 
  • ఇతని రాజధాని ధాన్యకటకం. ఇతని పరిపాలన కాలంలో 'నాసిక్' శాసనం వేయించబడింది. 
  • ఇతని యొక్క బిరుదు నవనాగరా స్వామి 
  • ఇతని కాలంలోనే ప్రఖ్యాత అమరావతి స్థూపం నిర్మించబడించి. దీనిని స్థానిక రాజు "వీలుడు" లేదా 'నాగరాజు' నిర్మించాడని పేర్కొంటారు. 
  • రుద్రదాముడు వేయించిన శాసనం పేరు - జునాఘడ్, దీనిలో శాతకర్ణిని రెండుసార్లు ఓడించినట్లు పేర్కొన్నాడు. ఇది సంస్కృతంలో వేయించిన మొదటి శాసనం. 
  • ఇతను కార్లెలో బౌద్ధ సన్యాసులకు విరాళాలు ఇచ్చాడు. 
  • ఇతని ఆస్థానంలోని 'టాలమీ' ఉన్నాడు. ఇతను భూకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఇతను రాసిన గ్రంధం "గైడ్ టు జాగ్రఫీ "
వాశిష్ఠ పుత్ర శివ శ్రీ శాతకర్ణి: 
  • ఇతను కూడా గౌతమీపుత్ర శాతకర్ణి కుమారుడు 
  • ఇతను రుద్రదాముని కుమార్తెను వివాహం చేసుకున్నాడు. 
  • ఇతను పాకృతం మరియు తమిళం రెండు భాషలతో నాణెములను ముద్రించిన తొలి శాతవాహన రాజు 
  • ఇతని బిరుదు క్షత్రప. 
యజ్ణశ్రీ శాతకర్ణి(క్రీ.శ. 165-194)
  • ఇతను పురాణాల ప్రకారం 26వ రాజు. శాతవాహనులలో చివరి గొప్పవాడు. 
  • ఇతను అనేక యజ్ఞాలు చేసి ఈ పేరు పొందాడు. 
  • ఇతను రెండు తెరచాపలున్న ఓడ బొమ్మ లేదా లంగరు వేసిన ఓడ చిహ్నంతో నాణేలు ముద్రించాడు. 
  • ఇతని కాలంలోనే మత్స్య పురాణం సంకలన ప్రారంభమైంది. 
  • ఇతని ఆస్థానంలో ఆచార్య నాగార్జునుడు ఉండేవాడు. 
  • యజ్ఞశ్రీ నాగార్జునిడి కొరకు శ్రీపర్వతం లేదా నాగార్జునకొండ పై మహావిహారం లేదా పారవాత విహారం నిర్మించాడు. 
  • మహారాష్ట్ర, మధ్యప్రదేశ్,ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలన్నింటినీ పాలించిన చివరి రాజు. 
విజయశ్రీ శాతకర్ణి
  • ఇతను 28 వ రాజు 
  • శ్రీపర్వతం దగ్గర విజయపురి పట్టణం ను నిర్మించాడు. 
  • ఇతని తరువాత చంద్రసేనుడు / చంద్రశ్రీ పాలించాడు. 
3వ పులోమావి 
  • ఇతను 30వ లేదా చివరి రాజు 
  • ఇతని సేనాధిపతి శ్రీమాంతమూలుడు
  • ఇతను బళ్లారిలో 'మ్యాకదోని' శాసనంను వేయించాడు. 

Reference Books: Telugu Academy

       Previous                                                                     Continue

Post a Comment

0Comments

Post a Comment (0)