శాతవాహనుల యుగం 2

TSStudies
0

శాతవాహనుల యుగం - తొలి శాతవాహనులు 


శాతవాహన రాజ్యస్థాపకుడు - శ్రీముఖుడు
అందరికంటే గొప్పవాడు - గౌతమీ పుత్ర శాతకర్ణి
చివరి గొప్పవాడు - యజ్ణశ్రీ శాతకర్ణి

శ్రీముఖుడు(క్రీ.పూ.231-208) :
  • ఇతను శాతవాహన రాజ్యస్థాపకుడు 
  • ఇతనిని పురాణాలు సింథకుడు, బలపుచ్ఛకుడు, బలి అని పేర్కొన్నాయి. 
  • ఇతని పరిపాలన కాలం 23 సంవత్సరములు. 
  • ఇతను మొదటగా జైన మతాన్ని స్వీకరించి చివర్లో వైదిక మతాన్ని ఆచరించాడు. 
  • ఇతని నాణెముల మీద 'సిరి చిముక', 'సిరి చిముక శాతవాహన', 'సిరి శాతవాహన' అనే 3 పేర్లు ఉన్నాయి. 
  • ఇతను రాఠీకులు అనే నాగ జాతి తెగను ఓడించి వారితో వివాహసంబందాలు ఏర్పరుచుకున్నాడు. 
  • ఇతని కుమారుడు 1వ శాతకర్ణి. 
కృష్ణుడు :
  • ఇతను  శ్రీముఖుని సోదరుడు 
  • ఇతని  పరిపాలన కాలం 18 సం. 
  • ఇతని 'నాసిక్' శాసనం లో శాతవాహన పాలనా పద్దతి, మౌర్యుల విధానంలో తీర్చిదిద్దినట్లు తెలుస్తుంది. 
  • ఇతడు నాసిక్ గుహలను తొలిపించాడు. నాసిక్ లో బౌద్ధ సన్యాసుల క్షేమం కొరకు ధర్మమహాత్య అనే అధికారులను నియమించాడు. 'భాగవత' మతం ఇతనికాలంలో దక్షిణభారతదేశానికి వ్యాప్తి చెందింది. 
మొదటి శాతకర్ణి :
  • ఇతను శ్రీముఖుని కుమారుడు. 
  • ఇతని పరిపాలన కాలం 18 సం
  • ఇతని భార్య పేరు నాయనిక (నాగానిక), ఈమె వేయించిన శాసనం పేరు నానేఘాట్, దీనిపై వీరి కుమార్తె మహారతి త్రణకయిరో, కుమారులు కుమార హకుశ్రీ, కుమార శాతవాహన, వెదిశ్రీ(పెద్ద కుమారుడు) ల ప్రతిమలు ఉన్నాయి. 
  • ఇతను రెండు అశ్వమేఘ యాగాలు, ఒక రాజసూయ యాగం, 20 క్రతువులను నిర్వహించాడు. 
  • ఇతని బిరుదులు - అప్రతిహతచక్ర, ఏకవీర, దక్షిణ పథపతి. 
  • 'గజ' గుర్తు గల నాణేలను ముద్రించాడు. 
  • పురాణాలూ ఇతడిని 'మహాన్', 'మల్లకర్ణ' అని పేర్కొన్నాయి. 
  • ఇతను 'ఉజ్జయిని పట్టణ' గుర్తుతో నాణేలు ముద్రించాడు. 
  • ఇతని సమకాలీన పాలకులు
                పుష్యమిత్రశుంగుడు - మగద
                ఖారవేలుడు - కళింగ
                డెమిత్రియస్ - ఇండో గ్రీకు
  • ఇతను కళింగ ఖారవేలుడు పై దండెత్తినట్లు 'ఛుళ్ళా కళింగ జాతక' ద్వారా తెలుస్తుంది. 
  • ఇతను తొలిసారిగా బ్రాహ్మణులకు పన్ను మినహాయింపు భూములను దానంగా ఇచ్చాడు. 
  • వైవాహిక సంబంధాల ద్వారా రాజ్య విస్తరణ చేశాడు. 
  • ఇతని భార్య నాగానిక తండ్రి పేరు మహారథకైరో (రాతికుల రాజు). 
2వ శాతకర్ణి 
  • పురాణాల ప్రకారం ఇతను 6వ రాజు 
  • ఇతని పరిపాలన కాలం 56 సం
  • ఇతను 'సాంచీ' స్థూపానికి దక్షిణ తోరణం నిర్మించాడు. 'ఆనందుడు' దక్షిణ తోరణం పై శాసనాన్ని చెక్కించాడు. 
  • ఉత్తర భారతదేశంలో రాజ్య(పాలన) విస్తరణ చేసిన మొదటి దక్షిణ భారతదేశ రాజుగా పేర్కొంటారు. 
  • ఇతని తరువాత లంబోదరుడు,అపీలకుడు, మేఘస్వాతి, స్వాతి, స్కందస్వాతి, మృగేంద్ర స్వాతి కర్ణి, కుంతల శాతకర్ణి, స్వాతి కర్ణి, అనే 8 మంది రాజులు పాలించారు. 
  • అపీలకుడు పరిపాలన కాలం 12 సం. పురాణాల ప్రకారం ఇతని పరిపాలన కాలం 8 వ రాజు  
కుంతల శాతకర్ణి :
  • ఇతని బిరుదు విక్రమార్క 
  • పురాణాల ప్రకారం ఇతను 13వ రాజు 
  • ఇతని ఆస్థానంలో శర్వవర్మ 'కాతంత్ర వ్యాకరణం' ను సంస్కృతంలో రచించాడు. 
  • ఇతని ఆస్థానంలో  అభివృద్ధి చెందినది 
  • కుంతల శాతకర్ణికి 6 నెలల్లో సంస్కృతం నేర్పించింది శర్వవర్మ . 
  • పైశాచిక భాషలో 'బృహత్కథ ను ఇతని ఆస్థానంలో రచించింది గుణాధ్యుడు. 
  • ఇతని భార్య పేరు మలయావతి. ఈమె 'కరిర్త' అనే రతి భంగిమ కారణంగా మరణించింది. 
  • కుంతలా శాతకర్ణి గురించి ఈ క్రింది గ్రంథాలలో పేర్కొనబడింది 
                1. వాత్సాయ కామ సూత్రం. (దీనిని తెలుగులోకి అనువాదం చేసినది పంచాంగుల  నారాయణ శాస్త్రి )
                2. రాజశేఖరుడి కావ్య మీ మాంస
                3. గుణాఢ్యుడి బృహత్కథ
  • ఇతని తరువాత స్వాతి కర్ణి పరిపాలించాడు. 
1 వ పులోమావి :
  • ఇతను 15వ రాజు ఇతను  చెందిన సుశర్మను ఓడించి మగధను 10 సం. లు పరిపాలించాడని వాయు పురాణం పేర్కొంది. 
  • పులోమావి ' గడ్డిలో జన్మించినవాడు' అని అర్థం. 
  • ఇతని తరువాత పాలకుడు శివస్వాతి . 
హాలుడు:
  • శాతవాహన చక్రవర్తులలో 17వ రాజు 
  • ఇతను సరస్వతాభిమాని, సాహితీవేత్త 
  • ఇతని బిరుదు కవి వత్సలుడు,
  • 'బాణుడు' తన హర్షచరిత్రలో గాదా సప్తశతిని హాలుడు రచించాడని పేర్కొన్నాడు. 
  • ఇతని భార్య  పేరు లీలావతి 
  • ఇతని వివాహంపై 'కుతూహలుడు' "లీలావతి పరిణయం" ను రచించాడు. 

Reference Books: Telugu Academy

       Previous                                                                     Continue

Post a Comment

0Comments

Post a Comment (0)