History of Kakatiya Dynasty కాకతీయులు 1

TSStudies

కాకతీయులు (క్రీ.శ.995-1323) Kakatiya Dynasty History

  • కాకతీయ వంశ స్థాపకుడు 1వ బేతరాజు 
  • వీరి యొక్క మూలపురుషుడు వెన్నడు 
  • మొట్టమొదటి స్వతంత్రపాలకుడు రుద్రదేవుడు 
  • అందరిలో గొప్పవాడు గణపతిదేవుడు 
  • కాకతీయులలో చివరి రాజు 2వ ప్రతాప రుద్రుడు 
  • వీరియొక్క రాజధాని హనుమకొండ, ఓరుగల్లు 
  • వీరియొక్క రాజ భాష సంస్కృతం 
  • రాజచిహ్నం వరాహం 
  • శాతవాహనుల తరువాత తెలుగు ప్రాంతాన్ని ఒక దగ్గరకు తీసుకు వచ్చిన వారు కాకతీయులు. 
  • కాకతీయుల గురుంచి మొట్టమొదటిసారిగా మాగల్లు శాసనం (క్రీ.శ. 956) లో ప్రస్తావించబడింది. ఈ శాసనాన్ని వేయించినవారు వేంగీ చాళుక్య రాజు దానర్ణవుడు. 
  • కాకతి దేవత పేరు మీదుగానే వీరికి కాకతీయులు అని పేరు వచ్చింది. 
  • వినుకొండ వల్లభాచార్యుని క్రీడాభిరామం ప్రకారం వీరు ఓరుగల్లులో కాకతి, ఏకవీర అనే గ్రామ దేవతలను పూజించారని, ఓరుగల్లు కోటలో కాకతమ్మ దేవాలయం ఉండటం వల్ల వారికి కాకతీయులు అనే పేరు వచ్చింది. 
  • కాకతి అనగా దుర్గాశక్తి అని విద్యానాథుని ప్రతాపరుద్ర యశోధం కూడా వివరిస్తుంది. 
  • "కాకతమ్మ దేవత కాకతీర్నామ దుర్గా భజయంతి ఇతి కాకతీయ" అని విద్యానాధుడు పేర్కొన్నాడు. 
  • గణపతిదేవుని సోదరి 'మైలాంబ' బయ్యారం శాసనం వేయించింది. దీనిలో కాకతీయుల వంశం గురుంచి వివరించబడింది. దీని ప్రకారం కాకతీయుల మూలపురుషుడు వెన్నడు. ఇతను దుర్జయ వంశానికి చెందినవాడు. ఇతను రాష్ట్ర కూటుల సేనాపతిగా ఉండి వేంగి చాళుక్యులపై యుద్ధం చేశాడు.
  • వెన్నడు యొక్క నాల్గవ తరం వాడు కాకతీ గుండ్యన. ఇతను వేంగి చాళుక్య రాజు మొదటి భీముడికి వ్యతిరేకంగా నిరువద్యపురం (క్రీ.శ. 900) చేశాడు. ఈ యుద్ధంలో భీముని కుమారుడు ఇరుముర్తి కాకతీయ గుండ్యను హతమార్చాడు. ఇతని ధైర్యసాహసాలకు 2వ కృష్ణుడు గుండ్యన కుమారుడు ఎర్రయ ను కొరివి ప్రాంతానికి పాలకుడిగా చేశాడు. 
  • ఎర్రియ అనంతరం బేతియ కొరివి పాలకుడు అయ్యాడు. 
  • బేతియ అనంతరం 4వ గుండ్యన లేదా కాకర్త్య గుండ్యన కొరివి పాలకుడు అయ్యాడు. అప్పుడు వేంగి చాళుక్య రాజ్యంలో దానార్ణవుడు మరియు 2వ అమ్మరాజు మధ్య వారసత్వ యుద్దాలు ప్రారంభమైనాయి. ఈ వారసత్వ యుద్ధంలో కాకర్త్య గుండ్యన దానార్ణవుడికి మద్దతు పలికాడు. దీనికి బదులుగా దానార్ణవుడు 'నతవాటి సీమ' ను కాకర్త్య గుండ్యనకు ఇచ్చాడు. 
  • ఇదే సమయంలో రాష్ట్రకూట రాజు 2వ కృష్ణుడు మరణించాడు. దీనితో రాష్ట్రకూటలు పతనం అయ్యారు. 
  • రాష్ట్రకూట చివరి రాజు 2వ కర్కరాజు ను 2వ తైలవుడు ఓడించి కళ్యాణి చాళుక్య రాజ్యాన్ని స్థాపించాడు. 
  • అప్పుడు కాకర్త్య గుండ్యన 2వ తైలవుడికి సామంతుడు అయ్యాడు. ఇతను హనుమకొండ రాకుమార్తెను వివాహం చేసుకున్నాడు. వీరికి 1వ బేతరాజు జన్మించాడు. ఇతను గుమ్మడికాయ వలె ఉండేవాడు. 
  • కాకతి అనగా గుమ్మడి అని అర్ధం. 
  • 1వ బేతరాజు కాలం నుంచి వీరిని కాకతీయులు అనేవారు. 
  • కాకర్త్య గుండ్యన సోదరి పేరు కామసాని. ఈమె భర్త విరియాల ఎర్ర భూపతి / ఎర్ర సేనాని. ఇతను 2వ తైలవుడికి సేనాధిపతి. ఇతని సహాయంతో ముదిగొండ పాలకుడు బొట్టు బేతరాజు కాకర్త్య గుండ్యనను హతమార్చాడు. 
  • దీని తరువాత 1వ బేతరాజు అనుమకొండకు పాలకుడిగా ప్రకటించ బడ్డాడు. 
  • ఈ విధంగా అనుమకొండలో 1వ బేతరాజు కాకతీయుల పాలనను ప్రారంభించాడు. 



Study Material:


Model Papers: