వేంగి చాళుక్యులు Eastern Chalukya Dynasty

TSStudies
0

తూర్పు చాళుక్యులు

తూర్పు చాళుక్యులు లేదా వేంగి చాళుక్యులు
వీరి రాజధాని కృష్ణా, గోదావరి ల మధ్య ఉన్న వేంగీ ప్రాంతం
బాదామి చాళుక్య రాజైన రెండవ పులకేశి వేంగీ ప్రాంతాన్ని జయించిన తరువాత తన సోదరుడైన కుబ్జవిష్ణువర్థునుడు ని ఆ ప్రాంత రాజ ప్రతినిధిగా నియమించారు. ఇతనినే వేంగీ చాళుక్య రాజ్యస్థాపకుడంటారు.
కుబ్జవిష్ణువర్థునుడు (క్రీ.శ.624-641)
  • ఇతనియొక్క బిరుదులు - విషమసిద్ధి, కామదేవ, మకరద్వజ 
  • (క్రీ.శ.631 సంవత్సరం నాటి 'కొప్పర శాసనం' ఇతన్ని స్వతంత్రంగా పరిపాలించడానికి రెండవ పులకేశి అనుమతి ఇచ్చాడని తెలుపుతుంది. 
  • ఇతని కాలంలో చైనా యాత్రికుడు 'హ్యుయాన్ త్సాంగ్' పర్యటించాడు. 
మొదటి జయసింహుడు (క్రీ.శ.642-673)
  • ఇతనికి కల బిరుదులూ సకలలోకాశ్రయ, సర్వసిద్ది 
  • పిప్పర్ల గ్రామంలో(గుంటూరు జిల్లా) తెలుగు భాషలో శాసనం వేయించబడింది. ఇది తూర్పు చాళుక్యుల నాటి తెలుగు శాసనం. 
ఇంద్రభట్టారకుడు (క్రీ.శ.673)
  • ఇతను 7 రోజుల రాజ్యపాలన చేశాడు. ఈ వారంలో కొండనాగూరు శాసనం వేయించాడు. 
  • ఇతని యొక్క బిరుదులూ త్యగాధనుడు, మకరధ్వజుడు 
రెండవ విష్ణువర్థునుడు (క్రీ.శ.673-682)
  • ఇతనిని ప్రజలు ధర్మశాస్త్రవేత్త అని పొగిడారు 
  • ఇతనికి విషమసిద్ధి, మకరధ్వజుడు,సర్వలోకాశ్రయ, ప్రళయాదిత్య అనే బిరుదులు కలవు. 
మంగి యువరాజు (క్రీ.శ.682-718)
  • ఇతనికి విజయసిద్ధి అనే బిరుదు కలదు 
రెండవ జయసింహుడు (క్రీ.శ.706-718)
  • ఇతని కాలం నుంచి వారసత్వ యుద్దాలు మొదలైనాయి. 
మూడవ విష్ణువర్థునుడు (క్రీ.శ.719-755)
  • వీరి ముఖ్యపట్టణం మన్యఖేతనం 
  • హైదరాబాదు రాష్ట్రమందు 'లాతురు' గ్రామం వీరి మొదటి నివాస ప్రాంతం 
  • ఇతనికి త్రిభువనంకుశ అనే బిరుదు కలదు 
  • వీరికాలంలో బాదామి చాళుక్యులు రాష్ట్రకూటులు అంతం చేశారు. దంతిదుర్గుని నాయకత్వాన నూతన సామ్రాజ్యం ఏర్పాటుచేశారు. 
నాల్గో విష్ణువర్థునుడు (క్రీ.శ.772-808)
  • ఇతను రాష్ట్రకూట రాజు మొదటి కృషుణునికి సామంతుడిగా జీవితాన్ని ప్రారంభించాడు 
రెండో విజయాదిత్యుడు (క్రీ.శ.808-847)
  • ఇతనికి నరేంద్ర మృగరాజు అనే పేరు కలదు. 
  • ఇతనికి కల బిరుదులూ నరేంద్రేశ్వర, నరేంద్రమృగరాజు, చాళుక్యరాజ, విక్రమదావళి 
కలివిష్ణువర్థునుడు (క్రీ.శ.847-848)
గుణగ విజయాదిత్యుడు (మూడవ విజయాదిత్యుడు (క్రీ.శ.849-892))
  • ఇతను తూర్పు చాళుక్యులలో అగ్రగణ్యుడు 
  • ఇతను రాష్ట్రకూటుల చిహ్నాలుగా ఉండే పాళీ ధ్వజాన్ని, గంగా - యమునా తోరణాన్ని స్వాధీనం చేసుకున్నాడు. 
మొదటి చాళుక్య భీముడు (క్రీ.శ.892-921)
  • ఇతని 30 సంవత్సరముల పరిపాలన కాలంలో 360 యుద్దాలు చేశాడు. 
మొదటి అమ్మరాజు (క్రీ.శ.921-927)
  • ఇతని కాలంలోనే రాజమహేంద్రపురం నిర్మించారు, దీనిని వారి రాజధానిగా చేసుకున్నారు 
  • ఇతనికి రాజమహేంద్రుడనే బిరుదు కలదు. 
రెండవ చాళుక్య భీముడు (క్రీ.శ.934-945)
రెండవ అమ్మరాజు  (క్రీ.శ.945-970)
దానవర్ణుడు (క్రీ.శ.970-973)
జటా చోడ భీముడు (క్రీ.శ.973-999)
  • ఇతని రాజధాని కర్నూలు జిల్లాలోని పెద్దకల్లు 
శక్తి వర్మ (క్రీ.శ.1000-1011)
  • ఇతనికి చాళుక్య చంద్రుడు అనే బిరుదు కలదు 
విమలాదిత్యుడు (క్రీ.శ.1011-1018)
రాజరాజనరేంద్రుడు (క్రీ.శ.1019-1061)
క్రీ.శ.1075లో విజయాదిత్యుడు మరణించడంతో వేంగీ చాళుక్య వంశం అంతరించింది. తరువాత ఇది చోళ సామ్రాజ్యంలో కలిసిపోయింది.

Post a Comment

0Comments

Post a Comment (0)