చాళుక్య యుగం Chalukya Dynasty

TSStudies
0
బాదామి చాళుక్య వంశం (క్రీ.శ.  543 - 752) or పశ్చిమ చాళుక్యులు (Western Chalukya Dynasty)
తూర్పు చాళుక్యుల వంశం (క్రీ.శ. 624 - 1025) or  వేంగీ చాళుక్యులు
వేములవాడ చాళుక్యులు (క్రీ.శ. 750 - 973)
ముదిగొండ చాళుక్యులు (క్రీ.శ. 850 - 1200)
కళ్యాణి చాళుక్యులు (క్రీ.శ. 973 - 1157)
  • చాళుక్యులు పూర్వికులు ఇక్ష్వాకులకు సామంతులుగా ఉండేవారు. వీరి రాజధాని విజయపురి. తరువాత కర్ణాటకకు వెళ్లి బాదామి ప్రాంతంలో రాజ్యాన్ని స్థాపించారు. 
  • వీరి రాజా చిహ్నం వరాహం
  • చాళుక్య వంశానికి మూల పురుషుడు జయసింహుడు లేదా జయవల్లభుడు. ఇతని తరువాత అతని కుమారుడు 'రణరాగుడు చాళుక్య' సింహాసనం అధిష్టించాడు. 

Badami Chalukya Dynasty (బాదామి చాళుక్యులు)

మొదటి పులకేశి (క్రీ.శ.535 - 566)
  • ఇతను రణరాగుడు ని కుమారుడు. స్వతంత్ర చాళుక్య రాజ్య స్థాపకుడు 
  • చాళుక్య వంశంలో ప్రథమంగా 'మహారాజ' బిరుదును ధరించింది ఇతనే 
  • ఇతని శాసనం ఒకటి ఏలేశ్వరం లో లభించింది కాబట్టి ఇతని రాజ్యం నల్గొండ వరకు విస్తరించింది అని చెప్పవచ్చును. 
కీర్తి వర్మ (క్రీ.శ. 566 - 597)
  • ఇతను కొంకణ ప్రాంతాన్ని ఏలిన మౌర్యులు, బనవాసి కదంబులను, బళ్లారిని ఏలిన నలవంశీయులను ఓడించి కొంకణం వరకు రాజ్యాన్ని విస్తరించాడు. 
  • ఇతను మొదటి పులకేశి కుమారుడు 
మంగలేశుడు (క్రీ.శ. 598 - 609)
  • ఇతను కీర్తి వర్మ తమ్ముడు 
  • ఇతనికి పరమ భాగవత అనే బిరుదు కలదు 
రెండవ పులకేశి (క్రీ.శ. 609 - 642)
  • ఇతను పశ్చిమ చాళుక్యులలో అగ్రగణ్యుడు. ఇతను దక్షిణ భారతదేశంలో కూడా అగ్రగణ్యుడు. 
  • నాటి ఉత్తర భారతదేశంలో 'హర్షుడు' ని ఓడించి యావత్ భారతదేశంలోనే ప్రథముడిగా నిలిచాడు. దీని గురుంచి అయ్యావోలు శాసనం తెలుపుతుంది. 
  • ఇతని యొక్క బిరుదు 'పరమేశ్వర'
  • పల్లవుల రాజధాని 'కాంచీపురం' దాకా వెళ్లి 'పుల్లలూర్' వద్ద జరిగిన ఘోర యుద్ధంలో పల్లవ మహేంద్రవర్మను ((క్రీ.శ. 600 - 630) ఓడించాడు 
  • మొదటి నరసింహ వర్మ ((క్రీ.శ.630-668) కాలంలో పులకేశి పల్లవుల చేతిలో మరణించాడు. నరసింహవర్మ బిరుదు వాతాపికొండ. 
  • ఇతని ఆస్థానానికి పర్షియా చక్రవర్తి 'ఖాస్రూ' ను తన రాయబారిగా పంపాడు.
  • చైనా యాత్రికుడు 'హ్యుయాన్ త్సాంగ్' (క్రీ.శ.641 లో దర్శించాడు. 
విక్రమాదిత్యుడు (క్రీ.శ. 642-680)
వినయాదిత్యుడు  (క్రీ.శ.680-696)
  • ఇతను గంగరాజు సేనల చేతిలో 'విలందే' యుద్ధంలో మరణించాడు. 
విజయాదిత్యుడు (క్రీ.శ.696-733)
  • గంగ-యమునా తోరణాన్ని పల ధ్వజాన్ని తమ అధికార చిహ్నంగా స్వాధీన పరుచుకున్నాడు. 
రెండవ విక్రమాదిత్యుడు (క్రీ.శ.733-744)
  • ఇతనికి సమకాలీనుడు రెండవ నందివర్మ ((క్రీ.శ.695-722 పల్లవవర్మ అనే బిరుదు కలదు)
రెండో కీర్తివర్మ (క్రీ.శ.745-752)
  • ఇతను పశ్చిమ చాళుక్యులలో ఆఖరివాడు. 

Post a Comment

0Comments

Post a Comment (0)