J M Girglani Commission-జె.ఎమ్. గిర్ గ్లాని కమిటీ

TSStudies
0
జె ఎమ్ గిర్ గ్లాని కమిటీ (J M Girglani Committee)
  • జూన్ 25, 2001న 610 జీవో అమలును పరిశీలించడానికి జె ఎమ్ గిర్ గ్లాని కమిటీ ఏర్పాటు చేసింది-నారా చంద్రబాబునాయుడు 
  • ఇది ఏకసభ్య విచారణ కమిటీ 
  • ఈ కమిటీ 90 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం గడువు పెట్టింది 
  • ఈ కమిటీ విచారణకు ప్రభుత్వం సహకారం లేకపోవడంతో 25% ఉద్యోగుల జాబితాతో తొలి నివేదికను 2001 అక్టోబర్ లో ప్రభుత్వానికి సమర్పించింది 
  • మొదటి మధ్యంతర నివేదికలో 25% ఉద్యోగుల తొలి జాబితా తయారు చేయబడింది
సూచనలు 
  • ఈ కమిషన్ రాష్ట్రపతి ఉత్తర్వులు 610 జీవో అమలు కోసం తాత్కాలికమైన, శాశ్వతమైన చర్యలను సూచించింది
  • సర్వీసు పుస్తకాలలో స్థానికత నమోదు జరగాలి 
  • ఉల్లంఘలను సరిచేసిన తరువాత కొత్త నియమాకాలు, పదోన్నతులు చేపట్టాలి 
  • రాష్ట్రపతి ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శిక్షణ ఇవ్వాలి 
  • రాష్ట్రపతి ఉత్తర్వులు 1975 అమలుపై శాశ్వత సభా కమిటీని చేయాలి 
  • రాష్ట్రపతి ఉత్తర్వులు 1975 అమలుపై శాశ్వత మంత్రుల కమిటీని చేయాలి 
  • రాష్ట్రపతి ఉత్తర్వుల్లో 1975 అమలుపై శాశ్వత అధికారుల కమిటీని శాశ్వతంగా నియమించాలి 
  • సాధారణ పరిపాలన శాఖ చూసే సర్వీసు నిబంధనల విభాగం బలోపేతం చేయాలి 
  • జీవో 610 అమలులో ఉల్లంఘనలను అధ్యయనం చేయటానికి రాష్ట్ర శాసనసభ హౌస్ కమిటీని నియమించింది
జీవో 610 పై హౌస్ కమిటీ 
  • జూన్ 15, 2001న ఆరు సూత్రాల పథకం అమలు పైన 5, 6 జోన్లలో జీవో నెంబర్ 610 అమలు పైన ఒక అఖిలపక్ష సమావేశం జరిగింది 
  • తెలంగాణ శాసనసభ్యులు డిసెంబర్ 29, 2001న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఉద్యోగ నియామకాలలో స్థానికులకు జరిగిన అన్యాయాల గురించి ప్రశ్నించారు 
  • దీనితో శాసనసభ హౌస్ కమిటీ నియమించబడింది. 
  • ఈ కమిటీ చైర్మన్ రేవూరి ప్రకాష్ (టిడిపి ఎమ్మెల్యే)
610 జీవో అమలుకు ఉత్తమ్ కుమార్ కమిటీ 
  • 2006 డిసెంబర్ 6న 610 జీవో అమలు కోసం ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు 
  • ఈ కమిటీ సభ్యుల లో ఉన్న సీమాంధ్ర ఎమ్మెల్యేలు కొంతమంది రాజీనామా చేయడంతో 610 జీవో అమలు కాలేదు
ప్రతాప్ కిషోర్ ఢిల్లీ పాదయాత్ర 
  • జర్నలిస్ట్ ప్రతాప్ కిషోర్ ప్రత్యేక తెలంగాణ అంశంనకు దేశవ్యాప్త మద్దతు కోసం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి 1987 జూన్ 6న తన పాదయాత్రను చార్మినార్ నుండి ప్రారంభించారు 
  • వీరు ఢిల్లీకి చేరుకుని ప్రధానమంత్రికి, కేంద్ర మంత్రులకు తెలంగాణ ఆవశ్యకతపై వినతి పత్రాలు సమర్పించారు
  • ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన అనంతరం వీరు తెలంగాణ ప్రజా సమితిని 1987లో పునరుద్ధరించారు దీనికి అధ్యక్షుడుగా భూపతి కృష్ణమూర్తి ఎన్నికయ్యారు
వెలిచాల జగపతిరావు నివేదిక 
  • 1991,1992 ప్రాంతంలో తెలంగాణ ప్రముఖ రాజకీయ నాయకుడు జగపతిరావు నీటిపారుదల రంగం పై నివేదికను ప్రచురించారు 
  • ముఖ్యాంశాలు 
  • కృష్ణ, గోదావరి పరివాహక ప్రాంతంలో తెలంగాణకు 1400 టిఎంసిల నీరు రావాలి. కానీ ఆంధ్రా పాలకులు తెలంగాణకు కేవలం 1170 టీఎంసీల నీరు పై హక్కు ఉన్నట్లు మాత్రమే చూపించారు 
  • శ్రీరాంసాగర్, నాగార్జునసాగర్, జూరాల, సింగూరు, శ్రీశైలం ఎడమగట్టు కాలువ పూర్తయితే తెలంగాణలో 30 లక్షల ఎకరాల భూమి సాగులోకి వస్తుంది. కానీ ఆంధ్రా పాలకులు వీటిని పూర్తి చేయడం లేదు 
  • తెలంగాణలో ప్రాముఖ్యత గల నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణానికి సాంకేతిక, పరిపాలన మరియు ఆర్థిక కారణాలు చూపిస్తూ దశాబ్దాలుగా వీటిని పూర్తి చేయడం లేదు

Study Material:


Model Papers:


Post a Comment

0Comments

Post a Comment (0)