Students Role in Telangana Movement-తెలంగాణ ఉద్యమం విద్యార్థులు

TSStudies
0
తెలంగాణ ఉద్యమం - విద్యార్థులు 
  • 1952లో చేపట్టిన  గైర్ ముల్కీ ఉద్యమంలో, 1969లో చేసినా తెలంగాణ తొలి దశ ఉద్యమంలో, 1996 అనంతరం చేపట్టిన మలిదశ ఉద్యమంలో అనేక విద్యార్థి సంఘాలు పోరాడి 2014 జూన్ 2 న తెలంగాణ రాష్ట్రం సిద్ధించే వరకు విద్యార్థులు కీలకపాత్ర పోషించారు 
  • 2009 నవంబరు 1న తెలంగాణలోని అన్ని యూనివర్సిటీల విద్యార్థులు 'తెలంగాణ విద్రోహదినం' పేరుతో భారీ ర్యాలీ నిర్వహించారు 
  • కెసిఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన తరువాత ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ ఉద్యమం పూర్తిగా విద్యార్థుల చేతుల్లోకి వెళ్లింది
  • 2009 డిసెంబర్ 10న 'చలో అసెంబ్లీ' కి పిలుపునిచ్చారు. కానీ 2009 డిసెంబర్ 9 అర్ధరాత్రి కేంద్ర హోంమంత్రి చిదంబరం తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ప్రారంభిస్తున్నామని ప్రకటించడంతో చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు
విద్యార్థుల ఆమరణ దీక్ష 
  • 2009 డిసెంబర్ 24న ఓయూ లోని ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో 18 మంది విద్యార్థులు తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు
ఓయూ విద్యార్థి గర్జన 
  • రాజకీయంగా రెండు పరస్పర విరుద్ధ ప్రకటనలు రావటంతో రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు 2010 జనవరి 3న విద్యార్థి జేఏసీ ఓయూలో విద్యార్థి గర్జన పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించింది 
  • 2010 జనవరి 8న తెలుగు విశ్వవిద్యాలయంలో అమరవీరుల సంస్మరణ సభ నిర్వహించారు
విద్యార్థుల రణభేరి 
  • 2010 జనవరి 23న నిజాం కాలేజి గ్రౌండ్ లో ఏబీవీపీ విద్యార్థి రణభేరి పేరుతో సభను నిర్వహించారు
  • ఈ సభకు ముఖ్య అతిథిగా సుష్మాస్వరాజ్ హాజరయ్యారు
విద్యార్థి పొలికేక సభ 
  • తెలంగాణ ప్రజలను చైతన్యం చేయడం కోసం విద్యార్థులు చేపట్టిన పాదయాత్ర వరంగల్ లో 2010 ఫిబ్రవరి 7న ముగింపు సందర్భంగా కాకతీయ విశ్వవిద్యాలయంలో 'విద్యార్థి పొలికేక' సభ జరిగింది 
  • ఓయూ విద్యార్థి ఐకాస 2010 ఫిబ్రవరి 21న అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది 
  • తెలంగాణ రాజకీయ జేఏసీ రెండు విడతలుగా బస్సు యాత్రను నిర్వహించింది 
  • మొదటి విడతగా 2010 మార్చి 21 నుండి 23 వరకు గన్ పార్క్ నుండి హనుమకొండ వరకు సాగింది 
  • రెండో విడత కొమరవెల్లి నుంచి మంచిర్యాల వరకు 2017 ఏప్రిల్ 9 నుండి 12 వరకు నిర్వహించింది 
  • 2010 మే 28న వరంగల్ జిల్లాలోని మానుకోట వద్ద జగన్ నిర్వహించిన ఓదార్పు యాత్రను తెలంగాణ ఉద్యమకారులు అడ్డుకున్నారు 
  • ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం 2011 జూలై 11న ఓయూలో విద్యార్థుల సామూహిక నిరాహార దీక్షలు ప్రారంభించారు
  • 2013 జనవరి 24న కాకతీయ యూనివర్సిటీ లో తెలంగాణ విద్యార్థి బహిరంగ సభను నిర్వహించారు
  • 2013 జూన్ 14న నిర్వహించబడిన 'చలో అసెంబ్లీ' కార్యక్రమంలో విద్యార్థులే అసెంబ్లీకి చేరి తెలంగాణ నినాదాలు చేశారు 

Post a Comment

0Comments

Post a Comment (0)