భారతదేశ ఆక్రమణ-7

TSStudies

రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధం(1802-05) :

బ్రిటీష్‌ గవర్నర్‌ జనరల్‌ - లార్డ్‌ వెల్లస్లీ
British Conquest of India,how british British Conquest of India,British Conquest of India,history of anglo maratha war in telugu,anglo maratha wars history notes in telugu,causes to anglo maratha wars notes in telugu,anglo maratha war summary in telugu,facts of anglo maratha wars in telugu,first anglo maratha war history in telugu,second anglo maratha war history in telugu,history of third anglo maratha war in telugu,agreements of anglo maratha wars
ఒకటవ బాజిరావు కాలం నుంచి మరాఠాలు అనేక సర్ధారులుగా వీడిపోయారు.
1) పూణె.  - పీష్వాలు
2) నాగ్‌పూర్‌ - బోంస్లేలు
3) గ్వాలియర్‌ - సింధియాలు
4) ఇండోర్‌ - హోల్కారులు
5) బరోడా - గైక్వాడ్‌లు
1802లో ఇండోర్‌ పాలకుడు జస్వంత్‌రావు హోల్కార్‌ పూణే వద్ద 2వ బాజిరావును కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఓడించాడు.
దీనికి ప్రతీకారం తీర్చుకొనుటకు పీష్వా 2వ బాజిరావు బ్రిటీష్‌ సహాయమును అర్జిస్తూ బస్సైన్‌ అనే ఒప్పందంపై సంతకం చేశాడు.
దీంతో 2వ ఆంగ్లో మరాఠా యుద్ధం ఆరంభమైంది.
బ్రిటీష్‌ గవర్నర్‌ జనరల్‌ లార్డ్‌ వెల్లస్లీ ఇద్దరు జనరల్స్‌ను (ఆర్ధర్‌ వెల్లస్లీ, లేక్‌) మరాఠాపైకి పంపాడు.
ఆర్ధర్‌ వెల్లస్లీ నాగ్‌పూర్‌పై దాడిచేసి బోంస్లేలను ఓడించి వారిచే 'డియోగం' అనే ఒప్పందంపై సంతకం చేయించాడు. ఈ ఒప్పందం ప్రకారం బోంస్లేలు కటక్‌, బాలాసోర్‌, వార్థా నది పశ్చిమాన ఉన్న భూభాగాన్ని బ్రిటీష్‌కు ఇచ్చారు.
జనరల్‌ లేక్‌ గ్వాలియర్‌పై దాడిచేసి సింధియాలను ఓడించి వారిచే సుర్జీ అర్జనగామ్‌ అనే ఒప్పందంపై సంతకం చేయించాడు. ఈ ఒప్పందం ప్రకారం సింధియాలు జైపూర్‌, జోధ్‌పూర్‌, గోహాధ్‌ కోటలను, గంగా యమున నదుల మధ్య ఉన్న భూభాగాన్ని బ్రిటీష్‌కు ఇచ్చారు.
తర్వాత జస్వంత్‌రావు హోల్కార్‌పై (ఇండోర్‌పై) బ్రిటీష్‌ వారు దాడులు చేశారు. కానీ జస్వంత్‌రావు హోల్కార్‌, భరత్‌పూర్‌ రాజు బ్రిటీషు వారి దాడులను తిప్పికొట్టారు.
1805 నాటికి ఎవ్వరునూ గెలిచే స్థితిలో లేకపోవుటచే రాజ్‌ఘాట్‌ అనే ఒప్పందం ప్రకారం 2వ ఆంగ్లో మరాఠా యుద్ధం అంతమైంది.
2వ ఆంగ్లో మరాఠా యుద్ధంలో జరిగిన ఒప్పందాలు:
బస్పైన్స్‌ ఒప్పందం - 1802
డియోగాం - 1803
సుర్జీ అర్జనగామ్‌ - 1803
రాజ్‌ఘాట్‌ - 1805

3వ ఆంగ్లో మరాఠా యుద్ధం(1817-18):
బ్రిటీష్‌ గవర్నర్‌ జనరల్‌ - లార్డ్‌ హేస్టింగ్స్‌ (లేదా) మార్క్య్స్‌ హేస్టింగ్స్‌.
పీష్వా 2వ బాజిరావు బస్సైన్‌ ఒప్పందం తర్వాత పూర్తిగా తన అధికారాలను కోల్పోయి బ్రిటీషు వారి యొక్క కీలుబొమ్మగా మారాడు.
తాను పోగొట్టుకున్న ప్రతిష్టను తిరిగి పొందుటకు ప్రయత్నించి పూణేలోని బ్రిటీష్‌ రెసిడెంట్‌ కార్యాలయంపై దాడిచేసి అక్కడి నుంచి ఆంగ్లేయులను తరిమివేశాడు.
దీంతో అప్పటి బ్రిటీష్‌ గవర్నర్‌ జనరల్‌ లార్డ్‌ హేస్టింగ్ యుద్ధం ప్రకటించి జనరల్‌ మాల్మోన్‌ను మరాఠాపై పంపాడు.
జనరల్‌ మాల్కోన్‌ ఈ క్రింది యుద్ధాలలో మరాఠాలను ఓడించాడు.
1) కిర్కీ - పీష్వాలను 1817లో
2) సీతల్‌బల్ది  - బోంస్లేలను 1817లో
3) మహదీపూర్‌-హోల్కార్‌లను _ 1817లో
4) కోరేగాం - పీష్వాలను 1817లో

ఈ క్రింది ఒప్పందాలు జరిగాయి
1) పూణే ఒప్పందం - 1817
2) గ్వాలియర్‌ ఒప్పందం 1817/
3) నాగ్‌పూర్‌ ఒప్పందం - 1817
4) మాండసోర్‌(హోల్కార్లతో) - 1818
మాందడసోర్‌ ఒప్పందం తర్వాత మరాఠా రాజ్యం పూర్తిగా బ్రిటీష్‌ ఆధీనంలోకి వచ్చింది.
మరాఠా ప్రతిష్టను కాపాడుటకై సతారా. అనే ఒక చిన్న రాజ్యం ఏర్పాటు చేయబడి. శివాజీ సంతతికి చెందిన ప్రతాప్‌సిన్హాకు అప్పగించబడింది.
British Conquest of India,how british British Conquest of India,British Conquest of India,history of anglo maratha war in telugu,anglo maratha wars history notes in telugu,causes to anglo maratha wars notes in telugu,anglo maratha war summary in telugu,facts of anglo maratha wars in telugu,first anglo maratha war history in telugu,second anglo maratha war history in telugu,history of third anglo maratha war in telugu,agreements of anglo maratha wars
పీష్వా 2వ బాజిరావు కాన్పూర్‌ (యూపీ) దగ్గర భీతూర్‌కు పంపబడ్డాడు.