తెలంగాణా చరిత్ర - సంస్కృతి
బాదామి చాళుక్య రాజైన 2వ పులకేశి వేంగి ప్రాంతాన్ని జయించి, తన తమ్ముడైన కుబ్జవిష్ణువర్ధనుడిని సామంత రాజుగా నియమించాడు.
ఇలా కుబ్జ విష్ణువర్ధనుడితో తూర్పు చాళుక్యుల పరిపాలన మొదలై చోళచాళుక్య రాజు విజయాదిత్యుడితో 1075 సం॥ వరకు కొనసాగింది.
📌 ముఖ్య పాలకులు - విశేషాలు
| పాలకుడు | విశేషాలు / ప్రాముఖ్యత |
|---|---|
| కుబ్జ విష్ణువర్ధనుడు | వంశస్థాపకుడు |
| గుణగ విజయాదిత్యుడు | గొప్పవాడు |
| 4వ కుబ్జవిష్ణువర్ధనుడు | రాష్ట్రకూటులతో వివాహ సంబంధాలు జరిపాడు |
| చాళుక్య భీముడు | ద్రాక్షారామ భీమేశ్వర ఆలయాన్ని నిర్మించెను. చెల్లవ్వను పోషించెను. |
| 2వ విజయాదిత్యుడు | బెజవాడను విజయవాడగా మార్చెను. 108 శైవాలయాలను 'మృగేశ్వరాలయాల' పేరుతో నిర్మించెను. |
| అమ్మరాజు-1 | రాజమండ్రి నగరంను నిర్మించెను |
| రాజరాజ నరేంద్రుడు | తెలుగు భాషను పోషించెను. ఆదికవి నన్నయ్యను, గణిత శాస్త్రవేత్త పావులూరి మల్లన్నను పోషించాడు |
| కుళోత్తుంగ చోళుడు | గంగైకొండ చోళపురంను రాజధానిగా చేసుకొనెను. (తూర్పు చాళుక్య వంశం + చోళవంశం) |
👑 రాజకీయ చరిత్ర (రాజుల కాలక్రమం & వివరాలు)
కుబ్జవిష్ణు వర్ధనుడు (624-641)
- ఇతని భార్య అయ్యణ మహాదేవి విజయవాడలో జైనుల కోసం నడుంబ వసతి గృహాన్ని నిర్మించింది.
- బిరుదులు : విషమ సిద్ధి, కామదేవ, మకరధ్వజ.
జయసింహుడు-1 (641-673)
- బిరుదులు : సర్వసిద్ధి, సకల లోకాశ్రయ.
- శాసనం : విప్పర్ల శాసనం (తొలి తెలుగు వచన శాసనం).
విష్ణు వర్ధనుడు -2 (673–683)
బిరుదు : 1. విషమసిద్ధి 2. ప్రళయాదిత్యుడు.
మంగియువరాజు (683-706)
బిరుదు : విజయాదిత్య, విషమసిద్ధి.
జయసింహుడు-2 (706-718)
బిరుదు : నిరవద్య.
కొక్కిలి మహారాజు (718)
ఎలమంచిలి రాజధానిగా పాలించాడు.
విష్ణువర్ధనుడు-3 (719–755)
పల్లవరాజు నందివర్మ దండనాధుడైన ఉదయ చంద్రుడు నెల్లూరు ప్రాంతంపై దండెత్తాడు.
విజయాదిత్యుడు-1 (755–772)
- ఇతని కాలంలో దంతిదుర్గుడు బాదామి చాళుక్యులను ఓడించి రాష్ట్రకూట రాజ్యం స్థాపించాడు.
- బిరుదులు : సమస్త భువనాశ్రయ, త్రిభువనాంకుశ, మహారాజాధిరాజ, పరమేశ్వర భట్టారక.
విష్ణు వర్ధనుడు 4 (772-808)
- ఇతని గూర్చి పంపకవి రచించిన 'విక్రమార్జున విజయం' తెలియజేస్తుంది.
- ధృవుడికి, 4వ కుబ్జ విష్ణువర్ధనుడికి జరిగిన యుద్ధంలో 4వ విష్ణువర్ధనుడు ఓడిపోయి తన కూతురు శీలమహాదేవిని ధృవుడికిచ్చి వివాహం చేశాడు.
విజయాదిత్యుడు -2 (808–847)
- బిరుదులు : నరేంద్ర మృగరాజు, చాళుక్య రామ, విక్రమధావళి.
- 108 శివాలయాలు నిర్మించాడు.
విష్ణువర్ధనుడు 5 (847-848)
ఇతనికి 'కలి విష్ణువర్ధనుడు' అని పేరు ఉంది.
గుణగ విజయాదిత్యుడు (848-891)
- ఇతని సేనాని పాండురంగడు బోయకొట్టాలపై దండయాత్రకు పంపి సఫలీకృతుడు అయినట్లు అద్దంకి శాసనం తెలుపుతుంది.
- ఈ శాసనంలో 'తరువోజ' ఛందస్సు పద్యాలు కలవు.
- గుణగ విజయాదిత్యుడు రాష్ట్రకూటులను సామంతులుగా చేసుకున్న వైనం సాతలూరు శాసనంలో తెలపబడింది.
- పాండురంగడు మహేశ్వరాలయం నిర్మించాడు.
- బిరుదులు : త్రిపుర మర్త్య మహేశ్వర, పరచక్రదామ, గుణకేనల్లాల, వల్లభ.
1వ చాళుక్య భీముడు (892-921)
- భీమేశ్వరాలయం నిర్మించాడు.
- ఆస్థానకవి : భట్టవామనుడు (ఇతను కావ్యా లంకారసూత్ర రచించాడు).
- బిరుదు : కవి వృషభ.
- గాంధర్వ విద్యా ప్రవీణగా కీర్తించబడిన చెల్లవ్వను పోషించెను.
విజయాదిత్యుడు 5 (922)
ఇతనిని 'కొల్లభిగండ' అని పిలుస్తారు.
మొదటి అమ్మరాజు (922–927)
రాజధానిని వేంగి నుంచి రాజమహేంద్ర వరమునకు మార్చాడు. బిరుదు : రాజమహేంద్ర.
విజయాదిత్యుడు–6
ఇతనికి బేతరాజు విజయాదిత్యుడు, కంఠికవి అని పేర్లున్నాయి.
2వ చాళుక్య భీముడు (934-935)
- శాసనాలు : మలయంపూడి శాసనం, మంగల్లు శాసనం, కలుచంబర్రు శాసనం. ఈ శాసనాలలో 2వ చాళుక్య భీముడి విజయచరిత్ర ఉంది.
- బిరుదులు : రాజభీమ, బృహద్భీమ, విష్ణువర్ధన, గండమహేంద్ర.
2వ అమ్మరాజు (945-970)
- దానార్ణవుడు ముదిగొండ చాళుక్యుల సహాయంతో అమ్మరాజుని ఓడించాడు.
- ఆస్థాన కవులు : కవిచక్రవర్తి, పోతనభట్టు. బిరుదు : కవిగాయక కల్పతరువు.
దానార్ణవుడు (970-973)
2వ అమ్మరాజు బావమరిది జటచోడభీముడు దానార్ణవుడిని జయించి వేంగిని ఆక్రమించాడు.
జటచోడ భీముడు (973–1001)
జటచోడభీముడు మొదటి శక్తివర్మను ఓడించి కాంచీనగరంను ఆక్రమించాడు. రాజరాజచోళుడు జటచోడ భీముడిని ఓడించాడు.
మొదటి శక్తివర్మ (999-1011)
విమలాదిత్యుడు (1011–1018)
- రాజరాజ చోళుని కుమార్తె కుందవ్వను, జటచోడభీముని కుమార్తెను వివాహమాడెను.
- రణస్థపూడి శాసనం ఇతనిని 'పరమబ్రాహ్మణ్య', 'పరమ మహేశ్వర' అని వర్ణించింది.
రాజరాజనరేంద్రుడు (1019–1061)
- రాజరాజ నరేంద్రునికి, విజయాదిత్యుడికి జరిగిన యుద్ధంలో ఓడిపోయి రాజ్యాన్ని కోల్పోయి చోళరాజేంద్రుని సహాయంతో 1035లో తిరిగి రాజ్యాన్ని పొందాడు.
- ఆంధ్రమహాభారతాన్ని రచించిన నన్నయ భట్టు రాజరాజ నరేంద్రుని ఆస్థానకవి.
- పశ్చిమ చాళుక్యుల రాయబారి నారాయణభట్టు నన్నయ్యకు సహకరించి నందంపూడి అగ్రహారం పొందాడు.
7వ విజయాదిత్యుడు (1062-1073)
విమలాదిత్యుడు మరణించిన తర్వాత రాజరాజ నరేంద్రునికి, విజయాదిత్యుడికి సింహాసనం కోసం యుద్దాలు జరిగాయి. కళ్యాణి చాళుక్య సోమేశ్వరుడి సాయంతో ఇతను రాజయ్యాడు.
కుళోత్తుంగ చోళుడు
- 1070 సం॥లో సింహాసనం ఆక్రమించాడు.
- రాజరాజనరేంద్రుడు మరియు రాజేంద్ర చోళుని యొక్క కూతురైన 'అమ్మాంగదేవి'కి జన్మించిన వాడు.
- 'కుళోత్తుంగ చోళుడు' అనే బిరుదుతో అధికారంలోకి వచ్చి 'చోళ-చాళుక్య' రాజ్యాలను కలిపి పాలించాడు.
- తన పేరు మీదుగా కుళోత్తుంగ చోళపురం (విశాఖపట్నం)ను నిర్మించాడు.
- విదేశీ వాణిజ్యానికి ప్రాధాన్యతను ఇచ్చాడు. ముఖ్యంగా 72మంది వర్తకులతో కూడిన వర్తక సంఘాన్ని చైనాకు రాయబారం పంపాడు.
- తన గొప్ప నౌకాబలంతో కళింగను జయించినట్లు 'కళింగట్టు పరణి' అనే గ్రంథంలో 'జయం గోండార్' తెలియజేశాడు.
- పాండ్యుల విజృంభణతో చాళుక్య చోళుల ప్రాభవం క్షీణించింది.
- 'వెలనాటి చోడులు, కాకతీయులు వీరి సామంతులు'.
🏛️ పరిపాలన వ్యవస్థ
- పరిపాలన సౌలభ్యం కోసం రాజ్యం విషయాలుగాను, నాడు, కొట్టము, గ్రామాలుగా విభజించారు.
- స్థానిక పరిపాలన కొంత వరకు చోళుల పరిపాలనను పోలి ఉంటుంది.
- గ్రామాలలో శాంతి భద్రతలు కాపాడే బాధ్యత గ్రామపెద్దలకే ఉంది.
- 2వ చాళుక్య భీముడి 'మచిలీపట్నం శాసనం' ఆంధ్రలో పంచాయితీ పరిపాలన ఉన్నట్లు తెలుపుతోంది.
👥 సాంఘిక & మత పరిస్థితులు
- బ్రాహ్మణులు ఉచ్చస్థితిలో ఉన్నారు.
- క్షత్రియులు యుద్ధం చేయుట ముఖ్య ధర్మంగా పాటించారు.
- వైశ్యులకు ప్రధాన వృత్తి - వ్యాపారం.
- సయాం (బర్మా) లో శక్తివర్మ బంగారు నాణేలు లభించాయి.
- మత పరిస్థితులు : బౌద్ధమతం, జైనమతం, హైందవమతం వ్యాప్తిలో ఉన్నాయి.
- 2వ అమ్మరాజు నిర్మించిన జైన దేవాలయాలు : సర్వలోకాశ్రయ ఆలయం, కటకాభరణ ఆలయం.
🛕 వాస్తు శిల్పాలు & దేవాలయాలు
- గుణగ విజయాదిత్యుడు దేవాలయ నిర్మాణంలో గంగా, యమున శిల్పాలు ఉన్నాయి.
- బెజవాడలో కుమారస్వామి ఆలయం నిర్మించింది - యుద్ధమల్లుడు.
- దానార్ణవుడు మాండవ్య నారాయణ ఆలయం నిర్మించాడు.
- అమరేశ్వర ఆలయం (అమరావతి)
- గుణపూడి (భీమవరం) సోమేశ్వర ఆలయం (సోమేశ్వరం)
- క్షీర రామేశ్వర ఆలయం (క్షీరారామం)
- రామలింగేశ్వరుని ఆలయం
- బ్రహ్మేశ్వరుని ఆలయం (చేబ్రోలు)
* అమరేశ్వర, సోమేశ్వర, భీమేశ్వర, చాళుక్య భీమేశ్వరాలయాలు మొదట బౌద్ధ ఆరామాలు, తరువాత శైవ క్షేత్రాలుగా మారాయి.
No comments:
Post a Comment