Vishnukundina Dynasty విష్ణుకుండినులు Notes Quick Review

Telangana History Vishnukundina Dynasty Lecture Notes

తెలంగాణా చరిత్ర - సంస్కృతి

విష్ణుకుండినులు (Vishnukundinas)
  • 'ఘటికలు' అనే హిందూ విద్యా సంస్థలు ప్రారంభించిన తొలి రాజవంశం.
  • శ్రీశైలమల్లిఖార్జున స్వామి భక్తులు.
  • శ్రీ పర్వత పాదక్రాంతులు.
  • కీసర గుట్టలోని రామలింగేశ్వరాలయం నిర్మాతలు.
  • నరబలిని ప్రోత్సహించిన రాజవంశం.

📌 ముఖ్య వివరాలు - అవలోకనం

స్థాపకుడు : ఇంద్రవర్మ (మహారాజేంద్రవర్మ)

గొప్పవాడు : 2వ మాధవవర్మ

చివరివాడు : మంచన భట్టారకుడు

రాజధాని : కీసర (వి.వి. కృష్ణశాస్త్రి ప్రకారం), ఇంద్రపాలనగరం (పి.వి.పరబ్రహ్మ శాస్త్రి ప్రకారం)

రాజభాష : సంస్కృతం

రాజచిహ్నం : పంజాఎత్తిన సింహం

రాజలాంచనం : శ్రీపర్వత భక్తులు

మతం : వైష్ణవం

ప్రత్యేకత : నరబలిని ప్రోత్సహించుట

శిల్పకళ : ఉండవల్లి గుహలు

👑 రాజకీయ చరిత్ర (పాలకుల వివరాలు)

ఇంద్రవర్మ (మహా రాజేంద్ర వర్మ)

  • ఇతను ఇంద్రపురం అనే రాజధాని నిర్మించాడు. ప్రస్తుతం దీనిని ఇంద్రపాల నగరంగా పిలుస్తున్నారు. (ఇంద్రపాల నగరం నల్గొండ జిల్లాలోనిది)
  • బిరుదు - ప్రియపుత్రుడు.

1వ మాధవ వర్మ

  • వాస్తవంగా విష్ణుకుండినుల అధికార స్థాపకుడు.
  • బిరుదు - విక్రమమహేంద్ర (పోలమూరు శాసనం).
  • ఉండవల్లి, భైరవకోన, మొగల్ రాజపురం గుహలు చెక్కించాడు.

గోవిందవర్మ

  • బిరుదు - విక్రమశ్రమ, ఉత్తమాశ్రయుడు.
  • ఇతని పట్టమహిషి మహాదేవి (బౌద్ధమతాభిమాని). మహాదేవి ఇంద్రపాలపురంలో బౌద్దబిక్షువులకు తన పేరు మీద మహావిహారం నిర్మించింది.
  • గోవిందవర్మ ఈ మహావిహారానికి దానం చేసిన గ్రామం - పెన్కపుర.

2వ మాధవ వర్మ

  • బిరుదులు : త్రికూట మలయాధిపతి, త్రివరనగర యువతి ప్రియుడు (పోలమూరు శాసనం ప్రకారం).
  • రాజధానిని ఇంద్రపాలపురం నుండి అమరావతికి మార్చాడు.
  • ఉండవల్లిలో ప్రసిద్ధి చెందిన బుద్ధుడి శిల్పాన్ని పగులగొట్టించి శయనిస్తున్న విష్ణుమూర్తి విగ్రహాన్ని చెక్కించాడు. అదే ప్రస్తుతం 'అనంత పద్మనాభస్వామి ఆలయం'.
  • రెండవ మాధవవర్మ ఉండవల్లి గుహలపై చెక్కించిన 'పూర్ణకుంభం' ఆంధ్రరాష్ట్ర అధికార చిహ్నంగా తీసుకోబడింది.
  • రాజసూయ యాగం, అశ్వమేధ యాగం, నరమేధ యాగం మొదలైనవి జరిపించాడు.
  • శాసనాలు : వేల్పూరు శాసనం, ఈపూరు శాసనం - 1, ఖానాపూర్ శాసనం.
  • నిర్మించిన ఆలయాలు : అమరేశ్వరాలయం (ఇంద్రపాలనగరం), జడల రామలింగేశ్వరాలయం (చెరువుగట్టు), మల్లికార్జున ఆలయం (ఇంద్రపాలనగరం), కేసరి రామలింగేశ్వర ఆలయం (కీసరగుట్ట).

3వ మాధవవర్మ

  • 2వ మాధవవర్మ కుమారుడు దేవవర్మ. అతని కుమారుడు 3వ మాధవ వర్మ.
  • ఇతని బిరుదులు - జనాశ్రయ, అవసిత వివిధ దివ్య.

విక్రమేంద్ర వర్మ

  • బిరుదు - మహాకవి (ఇంద్రపాల నగరం తామ్ర శాసనం).
  • 3వ మాధవ వర్మను ఓడించాడు.

ఇంద్రభట్టారక వర్మ

  • కీసరగుట్ట సమీపంలో ఘటికేశ్వర ఘటికాస్థానాన్ని స్థాపించాడు.
  • ఘటికలు అనే వైదిక విద్యాలయాలను స్థాపించినట్లు ఉద్దంకుడు రాసిన సోమవేదం తెలుపుతోంది.

విక్రమేంద్ర భట్టారక వర్మ / విక్రయేంద్రవర్మ

  • రాజధాని అమరావతి నుండి దెందులూరుకు మార్చాడు.
  • శాసనాలు : తుమ్మలగూడెం శాసనం 2, ఇంద్రపాల నగర తామ్రశాసనం, చిక్కుళ్ళ తామ్ర శాసనం.
  • బిరుదు - ఉత్తమాశ్రయుడు.
  • ఇంద్రపాలపురంలో గోవిందవర్మ భార్య మహాదేవి నిర్మించిన విహారానికి 'ఇరుందెర' అను గ్రామం దానం చేశాడు.

4వ మాధవ వర్మ

  • పొలమూరు-2, ఈపూరు 2 శాసనాలు వేయించాడు.
  • ఈపూరు శాసనం ప్రకారం బిరుదులు: న్యాయశాస్త్ర విశారదుడు, సూక్ష్మగ్రాహి.
  • గుణస్వామి అను కవి 'జనాశ్రయ చందోవిచ్ఛితి' గ్రంథం వ్రాశాడు.

మంచన భట్టారక వర్మ

ఇతనిని పృథ్వీమూల మహారాజు ఓడించినట్లు తాండివాడ శాసనం తెలుపుతుంది.

🏛️ పరిపాలన వ్యవస్థ

  • రాజ్యాన్ని విషయాలుగా విభజించారు.
  • విషయాధిపతులను అధికార పురుషులు, మహోత్తరులు అంటారు.
  • గజ దళాధిపతిని 'హస్తికోశ' అని, పదాతిదళాధిపతిని 'వీరకోశ' అని అంటారు.
  • భూమిని కొలిచే విధానం - వివర్తనం.
ఉద్యోగుల పేర్లు బాధ్యతలు / విధులు
రజ్జుకులుభూములను పగ్గాలతో కొలిచేవారు.
ఫలదారుడుపండిన పంటలో రాజభాగాన్ని నిర్ణయించే అధికారి.
సెట్టిప్రభుత్వానికి చెందాల్సిన ధాన్యం కొలిచే అధికారి.
అక్షపటలకప్రభుత్వ పత్రాలను భద్రపరిచేవాడు.
శాసన ఆజ్ఞప్తులురాజాజ్ఞలను వ్రాయించేవారు.
గుల్మికుడుసరిహద్దు రాష్ట్రాలపై నియమించిన సైనిక రాజప్రతినిధి.
⚖️ న్యాయపాలన

3వ మాధవవర్మ పొలమూరు శాసనంలో న్యాయపాలన ప్రస్తావన ఉంది. నేర నిర్ణయానికి దివ్య పరీక్షలు జరిపేవారు. న్యాయపాలనకు రాజు అత్యున్నత న్యాయాధికారి.

🛕 సాంఘిక, మత పరిస్థితులు
  • దక్షిణ భారతదేశంలో మొట్టమొదటగా హిందూగుహాలయాలు విష్ణుకుండినులు నిర్మించారు.
  • విష్ణుకుండినుల కాలంనాటి గొప్ప బౌద్ధక్షేత్రం - బొజ్జన్నకొండ.
  • వైదిక మతాభిమానులు (శ్రీపర్వత స్వామి భక్తులు).
  • విష్ణుకుండినులు బౌద్ధమతాన్ని కూడా పోషించారు.
🪙 ఆర్థిక పరిస్థితులు (నాణేలు)

ఇక్ష్వాకుల తర్వాత విష్ణుకుండినులు నాణెములు ముద్రించారు. రాగి, ఇనుముతో కూడిన లోహంతో నాణెములను ముద్రించారు. శంఖువు, సింహం గుర్తు వున్న నాణెములు ముద్రించారు.

📖 విద్య, భాషా సాహిత్య సేవ

  • రాజభాష - సంస్కృతం.
  • చిక్కుళ్ళ తామ్ర శాసనంలో 'విజయరాజ్య సంవత్సరంబుల్' అనే తెలుగు వాక్యం ఉంది. ఇది తెలుగులో లభించిన తొలి వాక్యం.
  • తొలి తెలుగు జంట కవులు అయిన నంది మల్లయ్య, ఘంట సింగన విష్ణుకుండినుల ఆస్థానంలోనివారే. వీరు 'ప్రభోధ చంద్రోదయం' అనే గ్రంథాన్ని రచించారు.

🎨 శిల్పకళ & గుహాలయాలు

ఉండవల్లి గుహాలయాలు (4 అంతస్థులు - గోవిందవర్మ నిర్మించెను)

  • మొదటి అంతస్థులో : త్రిమూర్తుల విగ్రహాలు ఉన్నాయి.
  • రెండవ అంతస్థులో : అనంతశయన విష్ణువు దేవాలయాలు ఉన్నాయి.
  • మూడవ అంతస్థులో : త్రికూట ఆలయం ఉంది.
  • నాలుగవ అంతస్థులో : సన్యాసుల విశ్రాంతి మందిరాలు కలవు.
  • ఈ గుహలలో పూర్ణకుంభం ఉంది, అనంత పద్మనాభ స్వామి విగ్రహం ఉంది.
  • ఉండవల్లి గుహలపై 'ఉత్పత్తి పిడుగు' అనే లేఖనం ఉంది.
🛕 భైరవకొండ గుహలు

8 గుహలున్న సముదాయం. ఇది శివునికి అంకితం చేయబడెను.

🛕 మొగల్రాజపురం గుహాలయం

ఇందులో ఉన్న విగ్రహాలు: అష్టభుజ నటరాజమూర్తి, త్రివిక్రమావతార విగ్రహం.

No comments:

Post a Comment