వెలమలు(రాచకొండ, దేవరకొండ) Recharla Padma Nayaks

TSStudies
0

వెలమలు(రాచకొండ, దేవరకొండ) History of Recharla Velama Dynasty in Telangana

రేచర్ల పద్మ నాయకులను వెలమ నాయకులు అని కూడా అంటారు. 
వీరి యొక్క మొదటి రాజధాని అనుమానగల్లు తరువాత రాచకొండ, దేవరకొండలను చేసుకుని పాలించారు 
వీరి వంశానికి చెందినవారు దేవరకొండను రాజధానిగా చేసుకుని పరిపాలించారు 
ఈ వంశం యొక్క స్థాపకుడు సింగమనాయకుడు
వీరిలో గొప్పవాడు 2వ సింగ భూపాలుడు 
వీరియొక్క పూర్వికులు కాకతీయ వంశంలో ఉన్నతమైన పదవులు చేపట్టారు. 
సింగమనాయుడు 2వ ప్రతాపరుద్రుడునికి సేనాధిపతిగా ఉన్నాడు 

రేచర్ల వెలమ వంశం (Recharla Velama Dynasty)
  1. సింగమనాయుడు (క్రీ.శ.1326-1361)
  2. మొదటి అనవోతనాయకుడు (క్రీ.శ.1361-1384)
  3. 2వ సింగభూపాలుడు (క్రీ.శ.1384-1399)
  4. 2వ అనవోతనాయకుడు (క్రీ.శ.1399-1421)
  5. మాదానాయకుడు (క్రీ.శ.1421-1430)
  6. 3వ సింగమనాయకుడు (క్రీ.శ.1430-1475)
దేవరకొండ వెలమ పాలకులు (Devarakonda Velama Dynasty)
దేవరకొండ రాజ్యాన్ని 1287 నుంచి 1475 వరకు 8 మంది రాజులు పరిపాలించారు. వారిలో ముఖ్యమైన కొందరు రాజులు . 
  1. రాజా మాధానాయుడు 2
  2. రాజా పెదవేదగిరి నాయుడు (క్రీ.శ.1384-1410)
  3. రాజా మాదానాయడు 3 (క్రీ.శ.1410-1425)
  4. రాజా లింగమనాయుడు  (క్రీ.శ.1425-1475)
సింగమనాయుడు (క్రీ.శ. 1326-1361) Recharla Velama Singhama Nayak
  • ఇతను వెలమ వంశ స్థాపకుడు 
  • ఇతను అనుమనగల్లును రాజధానిగా చేసుకుని పరిపాలించాడు. 
  • ఇతను జల్లిపల్లి కోటను ఆక్రమించే క్రమంలో సోమవంశ క్షత్రియులచే హతమార్చబడ్డాడు 
  • ఇతని తరువాత ఇతని కుమారుడు మొదటి అనవోతానాయకుడు పాలకుడయ్యాడు. 
మొదటి అనవోతనాయకుడు (క్రీ.శ.1361-1384)
  • ఇతను రాజధానిని అనుమనగల్లు నుంచి రాచకొండకు మార్చాడు 
  • ఇతను పరిపాలన సౌలభ్యం కొరకు రాజ్యాన్ని ఉత్తర, దక్షిణ భాగాలుగా విభజించి ఇతను ఉత్తర భాగానికి తన తమ్ముడును దక్షిణ భాగానికి దేవరకొండ రాజధానిగా పరిపాలన కొనసాగించారు. 
  • అప్పటినుంచి మదనాయకుడు వంశీయులు దేవరకొండ నుంచి పరిపాలించారు. 
  • ఇతని కాలంలోనే నాగనాథుడు విష్ణుపురాణంను రచించాడు. 
  • ఇతని తరువాత ఇతని 2వ సింగభూపాలుడు రాజ్యాన్ని అధిష్టించాడు.
కుమార సింగభూపాలుడు/2వ సింగభూపాలుడు (క్రీ.శ.1384-1399)
  • ఇతని యొక్క బిరుదులు సర్వజ్ఞ చక్రవర్తి,సర్వజ్ఞ చూడామణి, కళ్యాణిభూపతి, ప్రతి పండ భైరవ 
  • ఇతనియొక్క రచనలు రసార్ణవ సుధాకరం, రత్న పాంచాలిక, సంగీత సుధాకరము 
  • ఇతను యువరాజుగా ఉన్నప్పుడు కల్యాణదుర్గన్ని ఆక్రమించి కళ్యాణి భూపతి అనే బిరుదు పొందాడని ఇతని ఆస్థాన కవి విశ్వేశ్వరుడు తన చమత్కార చంద్రిక అనే  ప్రస్తావించాడు. 
2వ అనపోత నాయకుడు (క్రీ.శ.1399-1421)
  • వెలుగోటి వంశావళి గ్రంథం ఇతని యొక్క విజయాలను ప్రస్తావించింది. 
  • ఇతని కాలంలోనే వెలమ మరియు బహుమనీ ల మధ్య సంబంధాలు చెడిపోయినవి 
  • ఇతను (క్రీ.శ. 1417 లో బహుమనీలకు వ్యతిరేకంగా విజయనగర రాజులతో కలిసి వారిని ఓడించాడు. 
మాదానాయకుడు (క్రీ.శ.1421-1430)
  • ఇతను 2వ అనవోతా నాయకుడి సోదరుడు 
  • (క్రీ.శ.  1425 లో అహ్మద్ షా వరంగల్ ను ఆక్రమించాడు. దీనితో మదనాయకుడు బహుమనీలతో సంధి చేసుకుని వరంగల్ ను తిరిగి పొందాడు. 
  • ఇతను రామానుజాచార్యుని కుమారుడైన వెంకటచార్యుని శిష్యుడు 
  • ఇతని భార్య నాగాంబిక క్రీ.శ.1429 లో రాచకొండ సమీపంలో నాగసముద్రం అనే చెరువు త్రవ్వించింది. 
3వ సింగమ నాయకుడు (క్రీ.శ.1430-1475)
  • ఇతను 2వ అనవోతానాయకుడి కుమారుడు 
  • ఇతని యొక్క బిరుదులు ముమ్మడి సింగమనాయుడు, సర్వజ్ఞరావ్ సింగమనాయుడు 
  • ఇతని కాలంలోనే అహ్మద్ షా తెలంగాణను ఆక్రమించారు. 
  • తరువాత బహుమాని రాజు హుమాయూన్ దేవరకొండను కూడా ఆక్రమించాడు. 
  • దీనితో తెలంగాణ మొత్తం బహుమనీల ఆధీనంలోకి వచ్చింది. 
  • ధర్మనాయుడు శాయంపేట శాసనం వేయించాడు. 

Post a Comment

0Comments

Post a Comment (0)