చరిత్ర పూర్వ యుగం - చారిత్రక యుగం

TSStudies
0
తెలంగాణ చరిత్ర పూర్వయుగం 
Ø  చరిత్ర పూర్వయుగం అంటే లిఖిత పూర్వక ఆధారాలు లేని యుగం 
Ø  లిఖిత ఆధారాలు లభిస్తున్న గత 2300 సంవత్సరముల కాలాన్ని చారిత్రక యుగం అంటారు. 
Ø  తెలంగాణాలో మొదటిసారిగా చరిత్ర పూర్వ యుగానికి (బృహత్ యుగానికి) సంబందించిన ప్రదేశం నల్గొండ జిల్లా లోని వలిగొండ, దీనిని పరిశోధన చేసినవారు - రాబర్ట్ బ్రూస్ పూట్. 
Ø  హైదరాబాద్ పురావస్తుశాఖ 1914లో ఏర్పాటు చేయబడింది. 
Ø  కొత్త రాతియుగంలో మానవుడు ఉపయోగించిన పనిముట్టు - రాగి 
Ø  రాక్షసగూళ్ళ యుగంలో మానవుడు ఉపయోగించిన పనిముట్లు - ఇనుప పనిముట్లు, కావున ఈ కాలాన్ని అయో (ఇనుప) యుగమని కూడా అంటారు.  ఈ యుగంలో చిన్న చిన్న రాజ్యాలు, లిపి, నాగరికతా చిహ్నాలు ప్రారంభమైనవి. కాబట్టి ఈ యుగాన్ని "చరిత్ర పూర్వ యుగం" , "చారిత్రక యుగం", "మధ్య సంధి యుగం (ప్రోటో హిస్టరీ) లేదా "పురా చారిత్రక యుగం" అని అంటారు. 
Ø  చరిత్ర పూర్వ యుగాన్ని వారు వాడిన పనిముట్ల ఆధారంగా కూడా పిలుస్తారు. 
ఉదాహరణ:
దిగువపాత రాతియుగం - గులక రాయి పనిముట్లు 
మధ్య పాత రాతియుగం - రాతి పెచ్ఛుల పనిముట్లు 
ఎగువ పాత రాతియుగం - కొచ్చెటి పనిముట్లు 
మధ్య రాతియుగం - చిన్న చిన్న రాతి పనిముట్లు 
కొత్త రాతి యుగం - నున్నటి పనిముట్లు 
రాక్షసగుళ్ల యుగం - ఇనుప లోహ పనిముట్లు 
దిగువ పాత రాతియుగం (3 నుంచి 1.30 లక్షల సంవత్సరాల క్రితం):
ఈ యుగానికి చెందిన ముఖ్యమైన ప్రదేశాలు 
·        ఆదిలాబాద్ జిల్లాలోని బోత్ , పొచ్ఛేర జలపాతం 
·        కరీంనగర్ జిల్లాలోని గోదావరిఖిని , రామగుండం 
·        ఖమ్మం జిల్లాలోనే పాల్వంచ 
·        నల్గొండ జిల్లాలోని రాయవరం, ఏలేశ్వరం, నాగార్జున కొండ
·        మహబూబనగర్ జిల్లా లోని చంద్రగుప్త పట్టణం, ఈర్ల దిన్నె 
Ø  పెద్ద ఆకారాలతో ఉండే చేతి గొడ్డళ్లు, గోఖుడు రాళ్లు , వృత్తాకారపు రాళ్ళూ, ఈ యుగపు మనుషుల వేటలో మరియు ఆహారణ సేకరణలో ఉపయోగపడ్డాయి . 
Ø  ఈ యుగపు ఆయుధాలు ఆఫ్రికా లోని "అష్యులియన్" ప్రాంతపు ఆయుధాలతో పోలి ఉన్నాయి . 
మధ్య పాత రాతి యుగం (1 లేదా . లక్షల సంవత్సరాల క్రితం):
Ø  మొదటిసారిగా ఎద్దు అస్థిపంజరం అవశేషాలు లభించిన ప్రదేశం - మహబూబనగర్ జిల్లాలోని యపాలపాడు దగ్గర జరిపిన త్రవ్వకాల్లో.  దీనినిబట్టి ఈ యుగపు మానవులకు ఎద్దులతో సంబంధం ఉంది అని అర్ధం అవుతుంది. 
Ø  ఈ యుగపు మానవులు వదిన పనిముట్లు - చిన్న తరహా గొడ్డళ్లు, గండ్ర గొడ్డళ్లు, గోకుడు రాళ్లు 
ఎగువ పాత రాతి యుగం(క్రీ. పూ. 20000 - 10000 సంవత్సరాల క్రితం) :
Ø  ఈ యుగంలో జీవించిన ప్రజలు బ్లేడ్ పనిముట్లు, ప్రక్క అంచు ఉన్న బ్లేడ్ పనిముట్లు, కొన్నిచోట్ల ఎముకలతో చేసిన పనిముట్లను వాడారు. 
Ø  రాతి గుహల్లో రంగు బొమ్మలను గీయడం నేర్చుకున్నారు 
Ø  ఇది "హాలోసీన్" ఆరంభ దశను చుసిస్తుంది.  

మధ్య రాతి యుగం(క్రీ.పూ. 8500 - 3000 సంవత్సరాల క్రితం):
Ø  భౌగోళిక వాతావరణ పరంగా "తోలి హాలోసీన్" యుగానికి చెందినది.
Ø  ఈ యుగంలో అతి చిన్న (సూక్ష్మ) రాతి  ఆయుధాలను వాడారు. 
Ø  ఈ యుగాన్ని 'సూక్ష్మ రాతి యుగం" అని కూడా అంటారు. 
Ø  ఈ యుగానికి చెందిన గుహల్లోని రంగు చిత్రాల్లో 150 కి పైగా బొమ్మలు కనిపిస్తాయి. 
Ø  వీటిలో ప్రధానంగా జింక, చెవుల పిల్లి, హైనా, నక్క, కుక్క, తాబేలు, రేఖాగణిత నమూనాలు సున్నపురాయి, గ్రానైట్ రాయి కొండా గుహలలో కనిపిస్తాయి. 
Ø  వీటిలో ముఖ్యమైనది జింక చిత్రం. 
కొత్త రాతి యుగం (క్రీ.పూ. 3000 - 1500 సంవత్సరాల క్రితం):
Ø  ఈ యుగం మలిదశలో రాగి, కంచుతో పనిముట్లను తయారు చేయడం నేర్చుకున్నారు. వీటి సహాయంతో భూమిని త్రవ్వి మొక్కలను నాటడం, పెంచడం, పంటలను పండించడం నేర్చుకున్నారు. 
Ø  దీని వల్లనా స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తద్వారా కుటుంబం, సమాజం, గ్రామం ఏర్పడ్డాయి. 
Ø  పండిన పంటలను నిల్వ చేసుకోవడానికి పాత్రలు  అవసరమైనాయి దీనివల్ల కుండలు, బానాలు  తయారు చేసుకోవడానికి కారణమైనది. మొదట కుండలను చేత్తో చేసేవారు తరువాత కుమ్మరి చక్రాన్ని కనుకొన్నారు. వ్యక్తిగత ఆస్థి  అనే భావన పుట్టి ధనిక - పేద సమాజ ఏర్పాటుకు దారి తీసింది. 
Ø  పశువులను మఛ్చిక చేసుకున్నారు. పంట ఉత్పత్తి చేయడానికి వ్యాపారం పుట్టుకకు దారి తీసాయి. 
Ø  కరీంనగర్ జిల్లా లో తొగర్రాయి అవాసంలో  పైకి పొడుచుకు వఛ్చిన గ్రానైట్ గుట్టల దగ్గర పనిముట్లను తయారుచేసే కేంద్రం కనిపించింది. 
Ø  మట్టిపాత్రలకు ఎక్కువగా కెంపు రంగు అలంకారం ఉండేది. 
Ø  ఈ యుగపు ఆర్ధిక వ్యవస్థ ప్రధానంగా పశుపోషణ , వ్యవసాయం మీద ఆధారపడింది. 
Ø  బూడిద కుప్పలు, కొన్ని అడవి జంతువుల లేదా పశువుల దొడ్లు లభించిన ప్రదేశం - మహబూబనగర్ జిల్లాలోని ఉట్నూరు 
Ø  మూపురపు ఎద్దుల టెర్రకోట బొమ్మలు, తాటి చిత్ర లేఖనాలు కరీంనగర్ జిల్లాలోని బూదగది, వరంగల్ జిల్లాలోని పాండవుల గుట్ట, నల్గొండ జిల్లాలోని రాచకొండ, ఖమ్మం జిల్లాలోని నల్లముడి, మహబూబనగర్ జిల్లాలోని దుప్పాడు  గుట్ట, దొంగల గట్టు తదితర ప్రాంతాలు వెలుగు చూశాయి. 
Ø  ఈ కాలంలో ప్రజలు ప్రదానంగా జొన్నలు, పప్పులు, వడ్లు పండించేవారు. పంటలను ప్రధానంగా వర్షాధారంగానే పండించేవారు. 
Ø  కొత్త రాతియుగంలో చనిపోయిన వారి తలను ఉత్తరం వైపు పెట్టి ఖననం చేసేవారు. 
Ø  నాగార్జునకొండలో ఆవాస ప్రాంతంలో ఇద్దరి శిశువులను కుండలో సమాధి చేసిన ఆధారాలు కనిపించాయి. 
రాక్షసగుళ్ల  యుగం (క్రీ.పూ. 1500 - క్రీ. శ . 300 సంవత్సరాల వరకు)
Ø  ఈ యుగంలో ఇనుప వస్తువులు వాడటం వలన దీనిని అయో యుగమని అంటారు. 
Ø  చనిపోయిన వారి అస్థి పంజరాలను శవపేటికలో గాని, రాతిగుండులో  కానీ పెట్టి పూడ్చి ఆ గూడు చుట్టు  పెద్ద పెద్ద రాళ్లను వలయాకారంలో నిలిపేవారు. కావున ఈ యుగాన్ని రాక్షసగుళ్ల  యుగం అంటారు. స్థానిక ప్రజలు వీటిని పాండవుల గూళ్ళు, వీర్లపాడులని కూడా అంటారు. 
Ø  చనిపోయిన వ్యక్తికి  ప్రియమైన పెంపుడు జంతువులను (కుక్క) కూడా అతనితోపాటు ఖననం చేసేవారు. 
Ø  హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ ఆవరణలో ఉన్న రాక్షసగూడు  సమాధి దేశంలోనే మొదటిది. 
Ø  రాక్షసగుళ్ల సమాధులను నిర్మాణం ఆధారంగా 4 రకాలుగా వర్గీకరించవచ్చు. అవి 
1) గుంత సమాధులు: గుంత తవ్వి అందులో మట్టి శవపేటికలో గాని, దీర్ఘచతురస్రాకారపు రాతి పలకల గదిలో గాని అస్థిపంజరాన్ని పూడ్చి దాని చుట్టూ వలయాకారంలో పెద్ద పెద్ద రాళ్లను నిలిపితే దానిని గుంత సమాధి అంటారు. 
2) గూడుసమాదులు: దీర్ఘచతురస్రాకారపు  రాతి గదిని పూర్తిగా పూడ్చి వేయకుండా ఒక మూరెడు ఎత్తు భూమి ఉపరితలంపైకి కనిపించే విధంగా పూడ్చి దాని మీద ఒక రాతి పాలకను పెడితే దానిని గూడు సమాధి అంటారు. 
3) గది  సమాధి : రాతి సమాధి మొత్తం భూమి ఉపరితలం మీదనే ఉంటె దానిని గది సమాధి అంటారు. 
4) గుహ సమాధులు : కొండల్లో గుండ్రటి గుహలను తొలచి వాటిల్లో శవాలను పెట్టి కప్పువేస్తే వాటిని గుహ సమాధులు అంటారు. 
Ø  మహబూబనగర్ జిల్లాలోని ఉప్పలపాడు గుంతసమాధిలో పడవ ఆకారపు శవపేటిక లభ్యమైంది.  చిన్నమారూర్ గూడు సమాధిపై తడిక గుర్తులు కనిపించాయి. 
Ø  మహబూబనగర్ జిల్లాలో ఉన్న వీరాపురం సమాధుల్లో అనేక రకాల 'ఆహార ధాన్యాలు' లభించాయి. వాటిలో ముఖ్యమైనవి వరి, బార్లీ, కొర్రలు వంటి తృణ ధాన్యాలు. 
Ø  హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం లోని సమాధిలో రాగులు బయటపడ్డాయి. 
Ø  గుహరాళ్ళపై  చెక్కిన రేఖాచిత్రాలలో ప్రధానంగా త్రిశూలం, చక్కంలో నుంచి దూరిపోయే త్రిశూలం, బల్లెం కనిపిస్తాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)