ఇక్ష్వాకులు 1(Ikshvaku Dynasty)

TSStudies
1

Ikshvaku Dynasty Study Material in Telugu


  • ఇక్ష్వాకుల రాజ్య స్థాపకుడు శాంతమూలుడు 
  • వీరియొక్క రాజధాని విజయపురి 
  • ఇక్ష్వాకుల రాజ  చిహ్నం సింహం 
  • ఎహువల శాంతమూలిడి కాలం నుంచి శాసనాలు సంస్కృతంలో వేయబడినవి 
  • వీరికాలం నుంచి మేనత్త కూతుళ్లను వివాహం చేసుకునే సంప్రదాయం మొదలైంది 
  • పురాణాల ప్రకారం ఇక్ష్వాకులలో 7 గురు పాలకులు ఉన్నారు. కాని ఇక్ష్వాకుల శాసనాల ప్రకారం 4గురు మాత్రమే ఉన్నారు 
  • వీరి పరిపాలన కాలం సుమారు 100 సం. లు
వశిస్థిపుత్ర శాతకర్ణి (క్రీ.శ.220-233)
  • ఇతను స్వతంత్ర ఇక్ష్వాక రాజ్య స్థాపకుడు 
  • పూగియ, హిరణ్యక వంశీయులతో కలిసి శాతవాహన రాజు 3వ పులోమావిని తొలిగించి స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్నాడు 
  • ఇతనికి 'మహారాజ' అనే బిరుదు కలదు, ఇంకా శతసహస్త్రదానప్రదాత అనే బిరుదు పొందాడు 
  • ఇతను వైదిక మతాన్ని ఆచరించాడు 
  • ఇతను అనేకమైన శాసనాలు వేయించాడు(రెంటాల, దాచేపల్లి, కేశానాపల్లి)
  • ఇతని భార్య మఠారిశ్రీ, కూతురు అటవి శాంతిశ్రీ, కుమారుడు వీరపురుష దత్తుడు, సోదరిణులు శాంతశ్రీ,హార్మశ్రీ 
మఠరీపుత్ర శ్రీ వీరపురుషదత్తుడు  (క్రీ.శ.233-253)
  • ఇతను శాంతమాలుడు కుమారుడు, తలి పేరు మాధురి 
  • ఇతను ఇక్ష్వాక వంశంలో గొప్పవాడు 
  • నాగార్జునకొండ శాసనాన్ని అనుసరించి ఇతనికి 5గురు భార్యలు ఉన్నారు
  • ఇతను తన మేనత్త హార్మశ్రీ ఇద్దరి కూతుళ్లను (బాపిశ్రీ, షష్ఠిశ్రీ ) వివాహమాడాడు ఇంకా ముగ్గురు భార్యల పేర్లు -- బట్టీ మహాదేవి, రుద్రా భట్టారిక,శాంతశ్రీ.  
  • ఇతను మొదట్లో వైదిక మతాన్ని అనుసరించాడు తరువాత బౌద్ధమతాన్ని స్వీకరించాడు 
  • నాగార్జునకొండలోనే ఒక శిల్పంలో రాజు తన కుడి కాలుతో 'శివలింగాన్ని' తాకుతున్నట్లు ఉంది 
  • ఇతని ఏకైక కూతురు కొడబలిశ్రీ 
  • ఇతని కాలంలో 'ఉపశక బోధిశ్రీ' అనే మహిళ బౌద్ధమత వ్యాప్తికి కృషిచేసింది 
  • ఇతని యొక్క శాసనాలు -- అల్లూరిశాసనం, ఉప్పుగుండూరు శాసనం, నాగార్జునకొండ శాసనం, అమరావతి శాసనం, జగ్గయ్యపేట శాసనం. 
ఎహువల శాంతమూలుడు  (క్రీ.శ.253-277)
  • ఇతనిని రెండవ శాంతమూలుడు అంటారు 
  • తాతపేరు పెట్టుకునే సంప్రదాయం ఇక్ష్వాకుల నుంచే మొదలైంది. 
  • ఇతను వైదిక బౌద్ధ మతాలను ఆచరించాడు 
  • ఇతని కాలంనుంచే శాసనాలు "సంస్కృతం" లో చెక్కబడ్డాయి 
  • ఇతను దక్షిణభారత దేశంలో హిందూ దేవాలయాలను నిర్మించిన మొట్టమొదటి రాజు 
  • అప్పట్లో మహిళలు సంతానం కొరకు "హరిత దేవత" కు గాజులు సమర్పించేవారు 
  • ఇటీవల కాలంలో "గుమ్మడూరు" వద్ద ఎహువల శాంతమూలుడు యొక్క శాసనం లభించింది దీనిలో బౌద్ధ విద్యాలయానికి సంబందించిన వివరాలు ఉన్నాయి. 
ఇతను నిర్మించిన దేవాలయాలు
  • పుష్పభద్ర నారాయణస్వామి దేవాలయం (విజయపురిలో)
  • కార్తికేయని దేవాలయం (విజయపురిలో)
  • నందికేశ్వర ఆలయం 
  • నవగ్రహ ఆలయం (నాగార్జున కొండలో) 
  • హారతి దేవాలయం 
  • కుబేర ఆలయం (నాగార్జున కొండలో) 
రుద్రపురుషదత్తుడు (క్రీ.శ.283-301)
  • ఇతను ఇక్ష్వాకుల చివరి పాలకుడు 
  • ఇతని కాలంలోనే తోలి పల్లవ రాజులూ ఇక్ష్వాకుల రాజ్యంపై దాడులు చేసారు 
  • దీని గురుంచి సింహవర్మ వేయించిన "మంచికల్లు శాసనం" లో పేర్కొనబడింది . ఇది ఆంధ్రదేశంలో పల్లవుల తోలి శాసనం 
  • ఇక్ష్వాకుల కాలంలో నాగార్జునకొండ మంచి వర్తక కేంద్రంగా అభివృద్ధి చెందింది 
  • శ్రీలంక రాజులూ వారి బౌద్ధ సన్యాసుల కోసం 'నాగార్జున కొండ' వద్ద 'సింహళ విహారము' ను నిర్మించారు 
  • నాగార్జునకొండ ప్రసిద్ధ విశ్వవిద్యాలయం గా మారింది 
  • వీరికాలంలో అమరావతి శిల్పకళా పూర్తిగా వికసించింది 
  • వీరికాలంలో సంగమ వంశం కు చెందిన 'విరుగల్' అనే సంప్రదాయం మొదలైంది 
  • విరుగల్ అంటే 'రాజు కోసం జీవించి రాజు కోసం మరణించే అంగరక్షకులు'
  • వీరి కాలం నుంచే శాసనాలపై సంవత్సరాలు ప్రస్తావించే సంప్రదాయం మరియు నిర్మాణాలపై శిల్పుల పేర్లు చెక్కడం ప్రారంభమైంది 
  • వృత్తిపన్ను విధించబడినట్లుగా 'విషవత్తి శాసనం' ద్వారా తెలుస్తుంది. 

Post a Comment

1Comments

Post a Comment