Telangana State Formation-మలిదశ ఉద్యమం

TSStudies
0

తెలంగాణ మలిదశ ఉద్యమం 

తెలంగాణ రాష్ట్ర సమితి(Telangana Rastra Samithi T.R.S) 
  • తెలుగుదేశం పార్టీ తెలంగాణకు వ్యతిరేకంగా ఉండటంతో '2001 ఏప్రిల్ 27'న కేసీఆర్ హైదరాబాద్ లోని జలదృశ్యం(కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసం)లో తెలంగాణ రాష్ట్ర సమితి ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు 
  • ఇది 2001 మే 15న కరీంనగర్ లో 'సింహగర్జన' పేరుతో సభ జరిపింది. దీనికి జార్ఖండ్ ముక్తి మోర్చా నాయకుడు శిబుసొరేన్ తెలంగాణకు మద్దతు తెలిపారు 
  • జూన్ 1, 2001 న పాలమూరులో, జూన్ 2న నల్గొండ, జూన్ 4న నిజామాబాద్, జూన్ 5న నిర్మల్, జూన్ 21న వరంగల్ లో భారీ సభలు నిర్వహించారు
  • 2001 జూలై లో వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ నాగలి గుర్తుపై పోటీ చేసి కరీంనగర్(రాజేశ్వరరావు), నిజామాబాద్ (సంతోష్ కుమార్) జిల్లా పరిషత్ చైర్మన్ పదవులను గెలుచుకుంది 
  • ఇది 1000 ఎంపీటీసీ స్థానాలను, 87 జెడ్పిటిసి స్థానాలు, 84 ఎంపిపి స్థానాల్లో గెలిచింది 
  • 2001 నవంబర్ 17న ప్రజా గర్జన సభను ఖమ్మంలో నిర్వహించింది 
  • 2002 మార్చి 27న రంగారెడ్డి జిల్లా వికారాబాద్ లో శంఖారావ సభ నిర్వహించారు 
  • 2002 ఏప్రిల్ 27న టిఆర్ఎస్ ప్రథమ వార్షికోత్సవ సభను నల్గొండలో నిర్వహించింది. ఈ సభకు శిబుసొరేన్, అజిత్ సింగ్, భీమ్ సింగ్ హాజరయ్యారు.
టిఆర్ఎస్ కార్యక్రమాలు(Programmed by T.R.S)
  • టిఆర్ఎస్ పార్టీ 2002 సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 7 వరకు పల్లెబాట కార్యక్రమాన్ని నిర్వహించింది 
  • నవంబర్ 25, 2002 - జనవరి 6, 2003 వరకు జలసాధన కార్యక్రమాన్ని నిర్వహించింది 
  • జనవరి 6, 2003న హైదరాబాద్ నగరంలోని జింఖానా గ్రౌండ్స్ లో 'తెలంగాణ గర్జన' పేరుతో ఒక మహాసభను నిర్వహించింది 
  • ఏప్రిల్ 27, 2003 న వరంగల్ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర సమితి ద్వితీయ వార్షికోత్సవ సభలు జరిగాయి. ఈ సభకు టిఆర్ఎస్ పార్టీ వరంగల్ జైత్రయాత్ర అనే నామకరణం చేసింది 
  • రాజోలిబండ డైవర్షన్ పథకం సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి కేసీఆర్ 2003 మే 20-25 వరకు మహబూబ్ నగర్ లోని ఆలంపూర్ నుండి గద్వాల్ వరకు పాదయాత్ర చేశారు 
  • 2003 ఆగస్టులో మహబూబ్ నగర్ జిల్లాలోని కొల్లాపూర్ లో కోలాహలం సభ, నాగర్ కర్నూలులో నగారా సభ(2003 సెప్టెంబర్) నిర్వహించారు 
  • నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఆయకట్టు రైతులకు సంఘీభావం తెలిపే ఉద్దేశంతో కేసీఆర్ 2003 ఆగస్టు 25-30 వరకు కోదాడ నుండి హాలియా వరకు పాదయాత్ర చేశారు 
  • టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ వాదనను ఢిల్లీకి చేరవేయడానికి 2003 మార్చి 27న హైదరాబాద్ పలక్ నమా ప్యాలెస్ నుండి ఢిల్లీకి కారు ర్యాలీ చేపట్టారు 
  • 2003 సెప్టెంబర్ 9న మౌలంకార్ హోటల్ లో వివిధ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ నేతలు సభ నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రత్యేక రాష్ట్రాల జాతీయ కన్వీనర్ గా కేసీఆర్ ను ఎన్నుకున్నారు 
  • కాకినాడ తీర్మానం అమలు చేయక పోయేసరికి ఆలే నరేంద్ర బిజెపి నుండి బయటకు వచ్చి 'తెలంగాణ సాధన సమితి' అనే పార్టీని స్థాపించారు 
  • కేసీఆర్ తో సంప్రదింపుల అనంతరం తెలంగాణ కోసం ఐక్యంగా పోరాడాలని నిర్వహించి 2002 ఆగస్టు 11న టిఆర్ఎస్ లో తెలంగాణ సాధన సమితి విలీనమైంది 
  • సెప్టెంబర్ 17, 2003న ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కాలేజీ ముందు భారీ బహిరంగ సభను విద్యార్థులను ప్రత్యక్షంగా తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకునేలా దోహదం చేసింది 
  • 2003 నవంబరు 19న మెదక్ జిల్లాలో 'సింగూరు సింహగర్జన' అనే పేరుతో బహిరంగ సభ 
  • 2003 నవంబర్ 21న మహబూబ్ నగర్ జిల్లాలో 'పాలమూరు సింహ గర్జన' 
  • 2003 డిసెంబర్ 3న నిజామాబాద్ లో 'ఇందూరు సింహ గర్జన' 
  • 2003 డిసెంబర్ 5న వరంగల్ లో 'ఓరుగల్లు సింహ గర్జన' 
  • 2003 డిసెంబర్ 16న సిరిసిల్లలో 'కరీంనగర్ కథనభేరి' నిర్వహించారు

Post a Comment

0Comments

Post a Comment (0)