Telangana Province Rulers-తెలంగాణలోని సంస్థానాల పాలకులు

TSStudies
0
తెలంగాణలోని సంస్థానాల పాలకులు 

ద్వాల సంస్థానం 
జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్న గద్వాల సంస్థానం అతి ప్రాచీనమైనది. 
గద్వాల సంస్థానాధీశులు పాకనాటి రెడ్లు. 
వీరి ఇంటిపేరు ముష్టిపల్లి. 
వీరి ప్రథమ రాజధాని పూడూరు. పూడూరు, రాజ పత్రాల్లో కేశవ నగరంగా పేర్కొని ఉంది 
వీరు గద, వాలు అనే ఆయుధాలు ఉపయోగించడం వల్ల గదవాలు అనే పేరు వచ్చింది. కాలక్రమేణా అది గద్వాల్ గా మారింది. 
గద్వాల సంస్థానానికి ఆద్యుడు పెద సోమభూపాలుడు. 
సంస్థాన స్థాపకుడు పెద్దన్న వీరారెడ్డి. 
సంస్థానాన్ని పాలించిన చివరి పాలకురాలు మహారాణి శ్రీ ఆది లక్ష్మీదేవమ్మ. 
ఈమె కాలంలోనే గద్వాల సంస్థానం ఇండియన్ యూనియన్ లో విలీనమైంది. 

వనపర్తి సంస్థానం 
ఇది ప్రస్తుత వనపర్తి జిల్లాలో కలదు. ఈ  సంస్థానం  మొదటి రాజధాని నూగూరు. 
ఈ సంస్థానం పాలకుల ఇంటిపేరు జనుమ్ పల్లి. 
వీరు మోటాటి రెడ్డి వంశీయులు. 
ఈ సంస్థానం మూలపురుషుడు వీర కృష్ణ భూపతి (వీర కృష్ణారెడ్డి). 
ఈ సంస్థానం చివరి పాలకుడు రాజా రామేశ్వరరావు. ఈయన తల్లి సరళాదేవి. 
ఈ సంస్థానం 1948లో భారత యూనియన్ లో విలీనమైంది. 

అమరచింత సంస్థానం 
మహబూబ్ నగర్ జిల్లాలోని ఆత్మకూరు సంస్థానం 'అమరచింత సంస్థానం' గా మారింది. 
ఈ సంస్థానం మొదటి రాజధాని తివుండంపల్లి. 
ఈ సంస్థాన పాలకులు పాకనాటి రెడ్డి కులస్తులు. వీరి ఇంటిపేరు ముక్కెరవారు. 
ఈ సంస్థానానికి మూలపురుషుడు గోపాల్ రెడ్డి. 
ఈ సంస్థానం చివరి పాలకురాలు రాణి రామ్ భూపాల శ్రీమంత స్వయ్ రాణి భాగ్యలక్ష్మమ్మ. 
ఈమె శ్రీ రామ్ భూపాల్ బల్వంత్ బహదూర్ భార్య. 

జటప్రోలు సంస్థానం 
ఈ సంస్థానాధీశులు పద్మనాయక వంశీయులు. 
వీరి ఇంటిపేరు సురభి. వీరిది రేచర్ల గోత్రం. 
ఈ సంస్థల చివరి పాలకుడు రాజా వెంకట జగన్నాధ రావు. 

దోమకొండ సంస్థానం 
తొలుత 'బిక్కవోలు' సంస్థానం గా పిలిచే దోమకొండ సంస్థానం నిజామాబాద్ జిల్లాలో ఉంది. 
ఈ సంస్థానాధీశులు పాకనాటి రెడ్డి శాఖకు చెందినవారు. 
ఈ పాలకులు కామినేని వంశీయులు. వీరిది రాచమల్ల గోత్రం. భిక్కనూరు (బిక్కవోలు) లో వెలిసిన సిద్ధ రామేశ్వరుడు వీరి కుల దైవం. 
ఈ సంస్థాన స్థాపకుడు కామినేని చౌదరి. 
రాజన్న చౌదరి కుమారుడు రాజేశ్వరరావు రాజధానిని కామారెడ్డి నుండి దోమకొండకు మార్చాడు 
దోమకొండ చివరి పాలకుడు  రాజా సోమేశ్వర రావు. 

పాపన్నపేట సంస్థానం 
పాపన్నపేట సంస్థానం ప్రాచీన సంస్థానాల్లో ఒకటి. 
మెదక్ మొత్తం పాపన్నపేట సంస్థానంలో ఉంది. 
పాపన్నపేట సంస్థాన పాలకుల్లో రాయ్ బగాన్ రాణి శంకరమ్మ 12వ తరానికి చెందినవారు.
నిజాం ప్రభువు రాణి శంకరమ్మ పరిపాలనాదక్షత, యుద్ధ నైపుణ్యం చూసి 'రాయ్ బాగాన్' బిరుదుతో సత్కరించి  రాజలాంఛనాన్ని ప్రసాదించాడు. 
రాయ్ బగాన్ అంటే ఆడ సింహం అని అర్థం. 
సదాశివరెడ్డి (రాణి శంకరమ్మ దత్తపుత్రుడు) పాపన్నపేట సంస్థానాధీశుల్లో ప్రముఖుడు. ఇతని భార్య పార్వతి గద్వాల సంస్థానాధీశుని కూతురు. 
ఈ సంస్థానాధీశులకు 'చార్ హజార్' అనే బిరుదు ఉండేది. 
పాపన్నపేట సంస్థానం చివరి పాలకుడు 'రాజా రామచంద్రారెడ్డి'.

మునగాల సంస్థానం 
మునగాల సంస్థానం కృష్ణా జిల్లా (ఆంధ్ర ప్రదేశ్) నందిగామ తాలూకా లోనిది. 
ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం తరువాత పరిపాలనా సౌలభ్యం కోసం 1959లో నల్గొండ జిల్లాలో కలిపారు. 
రాణి లచ్చమ్మ దత్తపుత్రుడు నాయని వెంకటరంగారావు 1900లో మునగాల రాజాగా పదవి స్వీకరించాడు. 
సరళాదేవి పేరున వనపర్తి సమీపంలో 'సరళాసాగర్' నిర్మించారు. 

పాల్వంచ సంస్థానం 
పూర్వం 'శంకరగిరి' సంస్థానంగా పేరుగాంచిన పాల్వంచ సంస్థానం భద్రాది కొత్తగూడెం జిల్లాలో ఉంది. 
పాల్వంచ సంస్థానాధీశుల పూర్వీకులు కాకతీయ, ప్రతాపరుద్రుని సేనాలుగాను, అశ్వ సైన్యదీశులుగాను  వ్యవహరించిన పద్మనాయక వంశీయులు.. 
పాల్వంచ సంస్థానాన్ని పరిపాలించిన చివరి పాలకుడు 'విజయ అప్పారావు'.


Post a Comment

0Comments

Post a Comment (0)