మొఘల్‌ సామ్రాజ్యం Mughal Dynasty-10

TSStudies
అహ్మద్‌ షా (1748-54)
ఇతను ఇమాదుల్‌ ముల్క్‌ సహాయంతో పాలకుడయ్యాడు.
ఇతనికి, ప్రధాని ఇమాదుల్‌ ముల్మ్‌ మధ్య విభేదాలు రావడంతో ఇమాదుల్‌ ముల్క్‌ అహ్మద్‌ షాను గుడ్దివాడిని చేసి సింహాసనం నుండి తొలగించాడు.

2వ ఆలంగీర్‌ (1754-59)

ఇతను కూడా ఇమాదుల్‌ ములక్ ‌సహాయంతో పాలకుడయ్యాడు.
ఇతను ప్రధానితో విభేదాలు ఏర్పరచుకోవడంతో ఇమాదుల్‌ ముల్క్‌ రెండవ ఆలంగిర్‌ను హత్యచేసి అతని శవాన్ని యమునా నదిలో పడేశాడు.
ఇతని తర్వాత నామమాథత్రంగా 3వ షాజహాన్‌ సింహాసనంను అధిష్టించాడు.

2వ షా ఆలం/ షా గౌహర్‌ (1759-1806)

ఇతను ప్రధాని ఇమాదుల్‌ ముల్మ్‌కి భయపడి ఢిల్లీని విడిచిపెట్టి అలహాబాద్‌కు పారిపోయాడు. (ఫ్యూజిటివ్‌ ఎంఫెరర్‌)
ఇతని కాలంలోనే 1764లో బాక్సర్‌ యుద్ధం జరిగింది. దీని తరువాత ఇతను అలహాబాద్‌లో బ్రిటిష్‌ బందీగా వున్నాడు. ఇతని కాలం నుంచే మొఘల్‌ చక్రవర్తులు బ్రిటిష్‌ యొక్క పెన్షనర్లుగా మారారు.
మరాఠా పీష్వా 1వ మాధవరావు 2వ షా ఆలంను తిరిగి ఢిల్లీకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాడు.

2వ అక్చర్‌ (1806-87)
రెండవ అక్బర్‌ రామ్మోహన్‌రాయ్‌కి రాజా అనే బిరుదు ఇచ్చి, ప్రోత్సహించి అతన్ని లండన్‌కు పంపాడు.
(భారతదేశంలో కొన్ని సంఘసంస్కరణ చట్టాలు, తన పెన్షన్‌ పెంచమని విజ్ఞప్తులు చేయుటకు)
మొఘల్‌ రాజులలో చివరివాడు రెండవ బహదుర్‌షా(1837-58). ఇతడు 1857లో జరిగిన తిరుగుబాటులో నాయకత్వం వహించాడు. తిరుగుబాటు అణచివేసిన తర్వాత అంగ్లేయులు బహదుర్‌షాను ఖైదీగా 'రంగూన్‌'కు పంపారు. అచటనే బహదుర్‌షా 1862లో మరణించాడు.

మొఘల్‌ పరిపాలన:
మొగలుల కాలంలో జాగీర్‌(అనేది ఒక భూభాగం). ఇది ఢిల్లీ సుల్తాన్‌ల కాలంలో ఇక్తాను పోలి ఉంది.
వీరి పాలనలో వకీల్‌ -రాజప్రతినిధి
వజీర్‌ లేదా దివాన్‌ - రెవెన్యూ శాఖాధిపతి (ప్రధానమంత్రిగా/ ఆర్థిక మంత్రిగా)
మీర్‌ బక్షి - సైనిక శాఖాధిపతి
కాజీ - ఫిర్యాదులను విని తీర్పు చెప్పేవాడు
అమీల్‌ - భూమిశిస్తును వసూలు చేసేవాడు
మొగల్‌ పాలనలో దస్తూర్‌ ఉల్‌ అమీర్‌ అనే గ్రంథం రచించబడింది.
వీరి కాలంలో ప్రామాణిక బంగారు నాణెంను మహర్ అనేవారు.
వీరికి పర్షియన్‌ రాజభాషగా ఉండేది.
అక్బర్‌ సైనికుల గుర్తింపు చిహ్నాలను, గుర్రాలకు ముద్రవేసే పద్ధతి, పట్టికలలో సైనికుల వివరాలను నమోదు చేసే పద్ధతిని ప్రవేశపెట్టాడు.
అక్బర్‌ పరిపాలనలో సాధించిన గొప్ప విజయం భూమిశిస్తు విధానం. దీన్ని రెవెన్యూ మంత్రి తొడర్‌మల్‌ ప్రవేశపెట్టాడు. ఈ విధానాన్ని “బందోబస్త్‌ / ఐనీదాసలి విధానం అని కూడా అంటారు. దీని ప్రకారం శిస్తు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి నిర్ణయించబడుతుంది.
దీనిలో ప్రభుత్వానికి చెల్లించాల్సిన శిస్తు సరాసరి ఫలసాయంలో మూడో వంతు నిర్ణయించబడింది.
కరువు కాలంలో రైతులు కట్టవలసిన శిస్తు తగ్గించి వారికి విత్తనాలు, పశువులు కొనడానికి 'తక్కావీ' బుణాలు ఇచ్చేవారు.
మొఘల్‌ల కాలంలో నేత పరిశ్రమ మొదటిగా అభివృద్ధి చెందింది. దీనికి ఆగ్రా, వారణాసి(బనారస్‌), పాట్నాలో  దీని ఉత్పత్తి కేంద్రాలున్నాయి. ఢాకాలో పట్టు పరిశ్రమ, లాహోర్‌లో శాలువల పరిశ్రమ, సియల్‌కోటలో కాగితపు పరిశ్రమలున్నాయి.
భూమి 4 విధాలుగా విభజించబడింది. అవి
1. పోలజ్‌
2. పరౌతి
3. కాచల్‌
4. బంజర్‌
అక్బర్‌ ఆస్థానంలో వచ్చిన రాల్ఫ్‌పిచ్‌ అనే ఆంగ్లేయ యాత్రికుడు ఆగ్రా, ఫతేపూర్‌ సిక్రీలను రెండు మహానగరాలనీ, రెండూ లండన్‌ నగరానికన్నా పెద్దవనివర్లించాడు.
ఫాదర్‌ మాన్సరోట్‌ అనే జెసూట్‌ మత ప్రచారకుడు లాహోర్‌ మహానగరాన్ని వర్ణించాడు.