Fundamental Rights of Indian Constitution (Articles 12-35)-6

TSStudies
0
What is Doctrine of Severability in telugu

డాక్ట్రిన్‌ ఆఫ్‌ సెవరబిలిటి (Doctrine of Severability)

పార్లమెంటు చేసిన చట్టాలు, ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు, నిబంధన 13 ప్రకారం ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తే ఆ చట్టాలు చెల్లవు. అయితే మొత్తం చట్టాన్ని రద్దు చేయకుండా, ఏ భాగమైతే ప్రాథమిక హక్కులకు విరుద్ధమో, చట్టంలోని ఆ భాగం మాత్రమే రద్దు అవుతాయి. ప్రాథమిక హక్కులకు విరుద్దమయిన అంశాలను చట్టం నుంచి వేరుచేయడానికి వీలులేకపోతే, అప్పుడు మొత్తం చట్టం రద్దు అవుతుంది. ఈ ప్రక్రియనే డాక్ట్రిన్‌ ఆఫ్‌ సెవరబిలిటి అంటారు.

డాక్ట్రిన్‌ ఆఫ్‌ వైవర్‌ (Doctrine of  Waiver)
రాజ్యాంగం 3వ భాగంలో పొందుపరిచిన హక్కులను ప్రభుత్వాలు అమలు చేయాలి. ఏ పౌరుడు కూడా తమ హక్కులను వదులుకోవడానికి వీలులేదు. అమలు చేయాల్సిన బాధ్యత నుండి ప్రభుత్వాన్ని మినహాయించదానికి వీలులేదు. పౌరులు తమకు ఇష్టమైనా, లేకపోయినా అవగాహన ఉన్నా లేకపోయినా తమ హక్కులను వదులుకోవడానికి న్యాయస్థానాలు అనుమతించవు. ఈ సూత్రాన్ని డాక్ట్రిన్‌ ఆఫ్‌ వేవర్‌ అంటారు.
ఈ సూత్రాన్ని సుప్రీంకోర్టు 1959లో బసేశ్వర్‌నాథ్‌ Vs కమీషనర్‌ ఆఫ్‌ ఇన్‌కమ్‌టాక్స్‌ కేసులో ప్రస్తావించింది. అయితే ఈ సూత్రం భారత్‌లో పరిమితంగానే వర్తిస్తుంది.

డాక్ట్రిన్‌ ఆఫ్‌ ఎక్లిప్స్‌ (Doctrine of Eclipse)
రాజ్యాంగం అమలులోకి రాకముందు అమలులో ఉన్న చట్టాలు, రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత రాజ్యాంగ విరుద్ధంగా భావించినచో, ఆ చట్టాల చెల్లుబాటు విషయంలో సుప్రీంకోర్టు ఈ సూత్రాన్ని వినియోగిస్తుంది. రాజ్యాంగం అమలులోకి రాకముందు ఉన్న చట్టాలు రాజ్యాంగ విరుద్ధమయితే ఆ చట్టాలు పూర్తిగా కొట్టివేయబడవు, ఆ చట్టాల అమలును మాత్రమే నిలుపుదల చేస్తారు. అనగా వాటికి తాత్కాలికంగా గ్రహణం పడుతుంది. తదుపరి చట్టం ద్వారా ఆ గ్రహణాన్ని వివాధాస్పద అంశాన్ని తొలగిస్తే చట్టాలు అమలులోకి వస్తాయి. అయితే రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత చేసిన చట్టాలు రాజ్యాంగ విరుద్ధమయితే వాటీని మొత్తానికి రద్దు చేస్తారు. ఈ విధమైన ప్రక్రియనే డాక్ట్రిన్‌ ఆఫ్‌ ఎక్లిప్స్‌ అంటారు.

1955లో బికాజీ నారాయణ్‌ Vs స్టేట్‌ ఆఫ్‌ మధ్యప్రదేశ్‌
    ఈ వివాదంలో సుప్రీంకోర్టు పై సూత్రాన్ని పరిగణలోకి తీసుకుంది.

1959లో దీప్‌చంద్‌ Vs స్టేట్‌ ఆఫ్‌ ఉత్తరప్రదేశ్‌
    ఈ వివాదంలో సుప్రీంకోర్టు తీర్పు చెప్తూ, డ్రాక్టిన్ ఆఫ్‌ ఎక్లిప్స్‌ అనేది రాజ్యాంగం అమలులోకి రాక ముందు ఉన్నచట్టాలకు మాత్రమే వర్తిస్తుందని పేర్కొంది.

1974లో అంబికా మిల్స్‌ Vs     స్టేట్‌ ఆఫ్‌ గుజరాత్‌
    ఈ కేసులో సుప్రీంకోర్టు భిన్నమైన తీర్పును ప్రకటించింది.
    ఈ సూత్రం రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత చేసిన చట్టాలకు కూడా వర్తిస్తుందని సుప్రీంకోర్ట్‌ వ్యాఖ్యానించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)